Virata Parvam : దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం.. విరాట పర్వం. ఈ మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులు ఎప్పుడో పూర్తయినా సినిమా విడుదల చాలా ఆలస్యం అయింది. అనేక కారణాల వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీని జూన్ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ను ప్రస్తుతం వేగవంతం చేశారు. ఇక తాజాగా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించారు. ఇందులో సాయి పల్లవి ఎమోషనల్ అయింది. తనను ఆ విధంగా చూడొద్దని కోరింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ మూవీకి ఊడుగుల వేణు దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మించారు. తమ సొంత బ్యానర్పైనే ఈ మూవీని నిర్మించినప్పటికీ ఈ మూవీ రిలీజ్ ఇంత ఆలస్యం ఎందుకు అయిందో రానా చెప్పలేదు. అయితే ఈ సినిమా విడుదలయ్యాక నాలుగు వారాల్లో.. అంటే జూలై 17 తరువాత ఓటీటీలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అదే యాప్లో ఈ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
కాగా ఈ మూవీలో నందితా దాస్, నవీన్ చంద్ర, ప్రియమణి, నివేతా పేతురాజ్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా.. డానీ శాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు. ఇందులో రానా, సాయి పల్లవిలు రవన్న, వెన్నెలగా నక్సల్స్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…