Viral Video : నేటి సమాజంలో ఆడవారిపై అకృత్యాలు ఎక్కువైపోయాయి. కాలం మారుతుంది. అమ్మాయిలు కూడా ధైర్యం పెంచుకుని వాళ్లను వేధించేవారిని శిక్షించడానికి ఏమాత్రం భయపడటం లేదు. తమదైన రీతిలో వాళ్లకు తగిన గుణపాఠం నేర్పిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంతో ఇలాంటి ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి తనను వేధించాడన్న ఆరోపణతో ఓ మహిళ చెప్పులతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లా ఒరాయ్ నగరంలోని ఒక ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఆమెను ఈవ్ టీజ్ చేసినట్లు సమాచారం. ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ తన రెండు చెప్పులతో నాన్స్టాప్గా వంగి కూర్చున్న ఒక వ్యక్తిని కొడుతోంది. ఈ వీడియో ప్రకారం ఆ మహిళ 20 సెకన్ల వ్యవధిలో అతడిని చెప్పుతో 40 సార్లు కొట్టింది. అనంతరం ఆ ప్రాంత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ట్విట్టర్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటికే 50వేలకు పైగా వ్యూస్ రాగా 530 కంటే ఎక్కువ రీట్వీట్లను పొందింది. చాలా మంది నెటిజన్లు ఆ ఈవ్ టీజర్కు బుద్ధి చెప్పినందుకు ఆ మహిళ ధైర్యాన్ని అభినందించారు. మరికొందరు అతడికి ఇదే తగిన శిక్ష అని అన్నారు. ఆ అమ్మాయి ఆ వ్యక్తికి మంచి పాఠం నేర్పింది, ప్రతి అమ్మాయి అలాంటి ధైర్యం చూపించాలి, అప్పుడే అత్యాచారాలు, వేధింపుల సమస్యలు తొలగిపోతాయి.. అని కొందరు కామెంట్స్ చేయగా.. ఒక స్త్రీ చట్టాన్ని ఇలా తన చేతుల్లోకి తీసుకోకూడదు అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…