Viral Photo : ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉండడంతో ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక కొంతకాలంగా నెట్టింట త్రో బ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ షేర్ చేస్తుంటారు. స్టార్ హీరో హీరోయిన్స్ నుంచి సామాన్యుల వరకు ఈ ట్రెండ్ పేరుతో బాల్యానికి సంబంధించిన ఫోటోలను తమ సన్నిహితులతో ఫాలోవర్లకు షేర్ చేస్తున్నారు. ఇటీవల రామ్చరణ్, అల్లు అర్జున్, ఆలియా భట్, నాగచైతన్య, కీర్తి సురేష్, రష్మిక మందన్నా, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు చెందిన చిన్ననాటి ఫోటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా మరో యంగ్ హీరో త్రో బ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పైన ఉన్న ఫోటోలో వాళ్ల తల్లి పక్కనే కూర్చున్న ఈ క్యూట్ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో. ఇక యూత్లో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కుర్ర హీరో ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇక మీరు గుర్తు పట్టండి చూద్దాం.
ఆ క్యూట్ చిన్నోడు ఎవరో కాదు.. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. హ్యాపీడేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ ఆ తరువాత యువత, స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో కార్తీకేయ 2 సినిమా వచ్చింది. గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించారు. అయితే రెండు సినిమాల కథలు మాత్రం వేరే. కార్తికేయ 2 హిందీ మార్కెట్లో రూ.30 కోట్లను వసూలు చేసి ఘన విజయం సాధించింది. దీంతో కార్తికేయ 3 తీస్తామని ప్రకటించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…