Viral Photo : సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు. అయితే కొన్ని రకాల ఫొటోలు మాత్రం మనల్ని భ్రాంతికి గురి చేస్తుంటాయి. ఆ ఫొటోల్లో ఏదో ఒక వస్తువో, జంతువో, పక్షో.. దాగి ఉంటుంది. దాన్ని కనిపెట్టడం సవాల్గా మారుతుంది. అలాంటి ఫొటోలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. అప్పుడప్పుడు అలాంటి ఫొటోలు వైరల్ అవుతుంటాయి. దీంతో వాటిల్లో దాగి ఉన్నవాటిని కనిపెట్టేందుకు అందరూ నానా అవస్థలు పడుతుంటారు. ఇక అలాంటిదే ఒక ఫొటో లేటెస్ట్గా వైరల్గా మారింది. అందులో ఒక పక్షి దాగి ఉండడం విశేషం.
పైన ఇచ్చిన ఫొటోను లారెన్స్ డిబెలియల్ అనే మహిళ 2016లో తీసింది. బెల్జియంకు చెందిన ఆమెఅక్కడి నార్త్ ఇన్వర్నెస్ అనే ప్రాంతంలో ఉన్న బెన్ వైవిస్ అనే చోట కొండ ఎక్కుతూఈ ఫొటోను తీసింది. అయితే అది చాలా సాధారణ ఫొటో అని అందరూ అనుకున్నారు. కానీ అందులో ఒక పక్షి దాగి ఉన్నట్లు ఈ మధ్యే తెలిసింది. దీంతో దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్గా మారింది. ఈ క్రమంలోనే అందులో దాగి ఉన్న పక్షిని కనిపెట్టేందుకు నెటిజన్లు శ్రమిస్తున్నారు.
ఇక ఈ ఫొటోను చాలా జాగ్రత్తగా గమనిస్తే ఫొటో కింది భాగంలో ఎడమ వైపు ఓ పక్షి ఉంటుంది. కానీ అది అక్కడ ఉన్న రాళ్ల రంగులో కలసిపోయింది. కనుకనే ఆ పక్షిని కనిపెట్టడం కష్టంగా మారింది. ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతుండగా.. దీంట్లో దాగి ఉన్న పక్షిని కనిపెట్టేందుకు నెటిజన్లు శ్రమిస్తున్నారు. ఇక పక్షి కనిపించిందిగా మరి..!
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…