Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లైగర్. భారీ అంచనాలతో విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో అందరి అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం ఘోర పరాజయం కావడంతో పూరీ జగన్నాథ్ ని నిండా ముంచేసిందని చెప్పవచ్చు. కొన్ని సార్లు దర్శక నిర్మాతలు సినిమా కథాంశాన్ని హైలెట్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గుర్తింపు వస్తుంది అని ఆశ పడ్డాడు. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ అడియాశలయ్యాయి.
లైగర్ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ ముగ్గురు సంయుక్తంగా నిర్మించారు. దీంతో వారిరు పెట్టిన పెట్టుబడి వృథా అయ్యింది. రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టగా రూ.90 కోట్లు రాబడుతుందని లెక్కలు వేసుకుంటే రూ.20 కోట్లు మాత్రమే కలెక్షన్ వసూలు చేసింది. ఇంకా రూ. 70 కోట్లు వృథాగా పోయాయి. నిర్మాతలకు రూ.50 కోట్ల మేర నష్టం వచ్చినట్లు సినీ విశ్లేషక వర్గాలనుంచి టాక్ వినిపిస్తుంది. నిర్మాతలను కూడా ఈ చిత్రం భారీ నష్టాలతో నిలువునా ముంచేసింది.
హీరో విజయ్ దేవరకొండకు నిర్మాతలు లైగర్ చిత్రానికిగాను రూ.15 కోట్లు పారితోషికం కింద ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ఆశించిన మేరకు ఫలితం సాధించకపోవడంతో నిర్మాతలకు వచ్చిన నష్టాన్ని అర్థం చేసుకున్నాడు విజయ్. తనకు ఇచ్చిన పారితోషికంలో రూ.6 కోట్లు తిరిగి వారికి ఇచ్చినట్లు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ విశాల హృదయానికి అందరు ఫిదా అవుతున్నారు. నిర్మాతల కష్టాలను అర్థం చేసుకొని విజయ్ దేవరకొండ పారితోషకం లో సగభాగం ఇచ్చేయడంతో అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు.
విజయ్ గత సినిమాలతో పోలిస్తే లైగర్ సినిమా కనీసం వాటి అంచనాలు కూడా చేరలేకపోయింది. విజయ్ దేవరకొండ సినిమాకు పెద్ద అండ అని అందరు అనుకున్నా అది కలగా మిగిలిపోయింది. ఈ చిత్రంతో ఎదురైన చేదు అనుభవం పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ జనగణమన చిత్రం మీద పడకుండా పూరీ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…