Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ దేవరకొండకు యూత్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విజయ్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే త్వరలో లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్గా మారనున్నాడు. విజయ్కు యూత్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రముఖ కూల్డ్రింక్స్ కంపెనీ థమ్స్ అప్ తమ ప్రచారకర్తగా విజయ్ ను నియమించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్తో థమ్స్ అప్ యాడ్ తీసింది. అందులో విజయ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
ఒక భారీ షిప్లో విజయ్ దేవరకొండని తాళ్లతో కుర్చీకి కట్టేసి ఉంటారు. అనుకోకుండా ఫైట్ స్టార్ట్ చేసిన విజయ్ అందరి నుంచి తప్పించుకుని షిప్ పైకి వస్తాడు. తరువాత చివర్లో ఇది సాఫ్ట్ డ్రింక్ కాదు.. తుఫాన్.. అని థమ్స్ అప్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తాడు. ఈ క్రమంలోనే ఈ యాడ్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది.
గతంలో అనేక మంది స్టార్స్ థమ్స్ అప్కు ప్రచాకర్తలుగా ఉన్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్, మహేష్ బాబు, విశాల్ వంటి వారు థమ్స్ అప్కు ప్రచారం చేశారు. మొన్నీ మధ్యే థమ్స్ అప్ కంపెనీ మహేష్ బాబుతో ఉన్న తమ ఒప్పందం రద్దు అయినట్లు ప్రకటించింది. ఆ తరువాతే వారు విజయ్ దేవరకొండను ప్రచారకర్తగా తీసుకున్నారు.
తాజాగా తీసిన థమ్స్ అప్ యాడ్ హాలీవుడ్ లెవల్లో ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యాడ్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. అద్భుతమైన యాడ్తో విజయ్ ఆకట్టుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక గతంలో థమ్స్ అప్ టేస్ట్ ది థండర్.. అనే ట్యాగ్ లైన్ ఉండేది. కానీ దాన్ని మార్చారు. తెలుగులో.. ఇది సాఫ్ట్ డ్రింక్ కాదు, తుఫాన్.. అని.. హిందీలో.. సాఫ్ట్ డ్రింక్ నహీ తుఫాన్ హై.. అని చెప్పించారు. ఏది ఏమైనా.. విజయ్ నటించిన ఈ థమ్స్ అప్ యాడ్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…