Kidney : మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇవి మన శరీరంలో ఉండే విష పదార్థాలను, వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరంలోని రక్తాన్ని కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఫిల్టర్ అయిన రక్తాన్ని శరీరానికి అందిస్తాయి. ఇలా కిడ్నీలు నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. వ్యర్థాలను తొలగిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు చెడిపోతుంటాయి. కిడ్నీ వ్యాధులు వచ్చి కిడ్నీలు ఫెయిల్ అవుతుంటాయి. అలాంటప్పుడు శరీరం మనకు కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా ముందుగానే సమస్యను గుర్తించి జాగ్రత్త పడవచ్చు. తగిన సమయంలో చికిత్స తీసుకుని కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మరి కిడ్నీలు ఫెయిల్ అయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కిడ్నీలు ఫెయిల్ అయిన వారిలో తీవ్రమైన అలసట ఉంటుంది. చిన్న పని చేసినా త్వరగా అలసిపోతుంటారు.
2. తరచూ కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. వికారంగా ఉంటుంది. వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి.
3. కిడ్నీలు ఫెయిల్ అయిన వారిలో కంగారు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ఏ పని మీద దృష్టి పెట్టలేరు. ఏకాగ్రత లోపిస్తుంది.
4. శరీరంలో ఎక్కడ చూసినా వాపులు కనిపిస్తాయి. ముఖ్యంగా చేతులు, కాళ్లు వాపులకు గురవుతాయి. పాదాలు, మడమల దగ్గర వాపు బాగా ఉంటుంది. చేతి వేలితో వాపుపై నొక్కితే గుంతలాగా ఏర్పడుతుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్కు కచ్చితమైన సంకేతం అని చెప్పవచ్చు.
5. కిడ్నీలు చెడిపోయిన వారు తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. మూత్రాన్ని అసలు ఆపుకోలేకపోతుంటారు. దుస్తుల్లోనే అయిపోతుంటుంది.
6. రాత్రి పూట కాళ్ల కండరాలు, పిక్కలు పట్టేయడం బాగా జరుగుతూ ఉంటే అలాంటి వారిలో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని గుర్తించాలి.
7. చర్మం పొడిగా మారుతున్నా, దురదలు పెడుతున్నా.. కిడ్నీల సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
8. కిడ్నీలు ఫెయిల్ అయినవారిలో ఆకలి అసలు ఉండదు. ఏం తినాలని అనిపించదు. నాలుక లోహం రుచి మాదిరిగా అనిపిస్తుంటుంది. ఇనుమును రుచి చూస్తే ఎలా ఉంటుందో అలా నాలుక రుచి ఉంటుంది.
పైన తెలిపినవన్నీ కిడ్నీలు ఫెయిల్ అయినవారిలో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. మందులను వాడాలి. అలాగే సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రోజూ తగినంత నీటిని తాగాలి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఉన్నవారు వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. లేదంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధిక బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకుంటే కిడ్నీలపై భారం పడకుండా ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ పిక్సల్ 10ను కొనాలనుకున్నప్పటికీ ధర కారణంగా వెనకడుగు వేసిన వారికి శుభవార్త. పిక్సల్ 10…
టీ20 వరల్డ్కప్ 2026లో ఈసారి అమెరికాతో తలపడ్డ భారత్ అతికష్టం మీద గెలిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని రోజుల…
చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం(చెపాక్)లో విజిల్లపై నిషేధం అమలులోకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లతో ఈ నిర్ణయం అమలవుతోంది.…
గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్తో కలిసి చేసిన ఓ సరదా…
ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్…
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…