Venu Madhav : కోదాడ నుంచి వచ్చి సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్ గా జీవితాన్ని స్టార్ట్ చేసిన వేణుమాధవ్ ఆనతి కాలంలోనే స్టార్ కమెడీయన్గా ఎదిగాడు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. అయితే చాలా బిజీ కమెడీయన్గా ఉన్న సమయంలో వేణు మాధవ్ చాలా ఆస్తులు కూడా కూడబెట్టాడు. అయితే ఆయన మరణం, ఆస్తులు గురించి వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. నాకు ముగ్గురు మగపిల్లలు కాగా అందులో ఇద్దరు మగపిల్లలు. వేణు మాధవ్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు .. మిమిక్రీ బాగా చేసేవాడు. అప్పుడే ఒక ప్రోగ్రామ్ లో ఆయనను ఎస్వీ కృష్ణారెడ్డి – అచ్చిరెడ్డిగారు చూసి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు.
వచ్చిన అవకాశాన్ని వేణు మాధవ్ బాగా ఉపయోగించుకున్నారు. ఇండస్ట్రీలో నటుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వేణుకి ఒక అలవాటు ఉండేది.. ఎప్పుడు ఏ జబ్బు చేసినా మందులు వేసుకునేవాడు కాదు. తలనొప్పి వచ్చినా టాబ్లెట్ కూడా వేసుకునే అలవాటు వేణుకి లేదు.. అదే అతని కొంపముంచింది అన్నారు సావిత్రమ్మ. అయితే కొడుకు ఎదుగుదల చూసి సంతోషించానని.. సినిమాలతో వేణు మాధవ్ బిజీగా ఉండటం వలన నా ఇద్దరు కొడుకులను కూడా ఆయన దగ్గర అసిస్టెంట్లుగా చేశాను. అయితే అదే నేను చేసిన పెద్ద తప్పు అన్నారు సావిత్రమ్మ.
జాండిస్, డెంగ్యూ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే వేణు మాధవ్ చాలా నిర్లక్ష్యం చేశాడు. దాంతో పరిస్థితి చేయి దాటిపోయి వేణు మాధవ్ చనిపోయాడని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది సావిత్రమ్మ. వేణు చనిపోయే నాటికి రూ. 20 కోట్లకి పైగా ఆస్తులున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. కూతురు పెళ్లి టెన్షన్ తో ఒక కొడుకు చనిపోగా, అతను చనిపోయిన నెలా పదిహేను రోజుల్లోనే వేణుమాధవ్ కూడా చనిపోయాడు. ఇద్దరు కొడుకుల చావు చూసి..నేను ఎందుకు బతికి ఉన్నానా అని అనిపించింది. ఇక వేణు మాధవ్ చనిపోయేనాటికే చాలా ఆస్తులు ఉన్నాయని.. ఏడెనిమిది ఫ్లాట్ లతో పాటు దాదాపు 20 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయన్నారు. అన్ని ఉన్నా తల్లిగా నాకు ఉపయోగం ఏమీలేవు.. నేను మాత్రం మరో కొడుకును చూసుకుంటూ.. అద్దె ఇంట్లో కాలం వెల్లదీస్తున్నాను అని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…