Venu Madhav : కోదాడ నుంచి వచ్చి సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్ గా జీవితాన్ని స్టార్ట్ చేసిన వేణుమాధవ్ ఆనతి కాలంలోనే స్టార్ కమెడీయన్గా ఎదిగాడు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. అయితే చాలా బిజీ కమెడీయన్గా ఉన్న సమయంలో వేణు మాధవ్ చాలా ఆస్తులు కూడా కూడబెట్టాడు. అయితే ఆయన మరణం, ఆస్తులు గురించి వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. నాకు ముగ్గురు మగపిల్లలు కాగా అందులో ఇద్దరు మగపిల్లలు. వేణు మాధవ్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు .. మిమిక్రీ బాగా చేసేవాడు. అప్పుడే ఒక ప్రోగ్రామ్ లో ఆయనను ఎస్వీ కృష్ణారెడ్డి – అచ్చిరెడ్డిగారు చూసి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు.
వచ్చిన అవకాశాన్ని వేణు మాధవ్ బాగా ఉపయోగించుకున్నారు. ఇండస్ట్రీలో నటుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వేణుకి ఒక అలవాటు ఉండేది.. ఎప్పుడు ఏ జబ్బు చేసినా మందులు వేసుకునేవాడు కాదు. తలనొప్పి వచ్చినా టాబ్లెట్ కూడా వేసుకునే అలవాటు వేణుకి లేదు.. అదే అతని కొంపముంచింది అన్నారు సావిత్రమ్మ. అయితే కొడుకు ఎదుగుదల చూసి సంతోషించానని.. సినిమాలతో వేణు మాధవ్ బిజీగా ఉండటం వలన నా ఇద్దరు కొడుకులను కూడా ఆయన దగ్గర అసిస్టెంట్లుగా చేశాను. అయితే అదే నేను చేసిన పెద్ద తప్పు అన్నారు సావిత్రమ్మ.
జాండిస్, డెంగ్యూ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే వేణు మాధవ్ చాలా నిర్లక్ష్యం చేశాడు. దాంతో పరిస్థితి చేయి దాటిపోయి వేణు మాధవ్ చనిపోయాడని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది సావిత్రమ్మ. వేణు చనిపోయే నాటికి రూ. 20 కోట్లకి పైగా ఆస్తులున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. కూతురు పెళ్లి టెన్షన్ తో ఒక కొడుకు చనిపోగా, అతను చనిపోయిన నెలా పదిహేను రోజుల్లోనే వేణుమాధవ్ కూడా చనిపోయాడు. ఇద్దరు కొడుకుల చావు చూసి..నేను ఎందుకు బతికి ఉన్నానా అని అనిపించింది. ఇక వేణు మాధవ్ చనిపోయేనాటికే చాలా ఆస్తులు ఉన్నాయని.. ఏడెనిమిది ఫ్లాట్ లతో పాటు దాదాపు 20 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయన్నారు. అన్ని ఉన్నా తల్లిగా నాకు ఉపయోగం ఏమీలేవు.. నేను మాత్రం మరో కొడుకును చూసుకుంటూ.. అద్దె ఇంట్లో కాలం వెల్లదీస్తున్నాను అని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…