Venkatesh : తెలుగు సినీ ప్రేక్షకులకు విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరీర్ తొలినాళ్లలో చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అందుకనే విక్టరీని తన పేరుకు తగిలించుకున్నారు. ఇక వెంకటేష్తోపాటు ఆయన కుటుంబం మొత్తం లో ప్రొఫైల్ ను మెయింటెయిన్ చేస్తారు. వారు ఎక్కువగా బయట కనబడరు. కానీ వెంకటేష్ మాత్రం ఎప్పుడో మరీ ముఖ్యమైన ఫంక్షన్ ఉంటే తప్ప వెళ్లరు. అలాగే ఇతర సినిమాలకు చెందిన ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ ఈయన కనిపించేది తక్కువే.
ఇక వెంకటేష్ ఇప్పటి వరకు వివాద రహితుడిగా ఉన్నారు. ఆయన అవసరమైన విషయాల జోలికి వెళ్లరు. ఏ వివాదంలోనూ చిక్కుకున్న దాఖలాలు లేవు. ఎక్కడ ఎలా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి.. ఎక్కడ తగ్గి ఉండాలి.. అనే విషయం కచ్చితంగా తెలిసి ఉన్న వ్యక్తి వెంకటేష్. అయితే సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈ మధ్యే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ వెంకటేష్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు.
వెంకటేష్కు మొహమాటం ఎక్కువని మురళీ మోహన్ తెలిపారు. మా అసోసియేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి అధ్యక్షుడి స్థానంలో హీరోలనే ఉండాలని నిర్ణయించాం. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్లు, ఇతర చిత్ర యూనిట్కు చెందిన వారు అయితే పెద్దగా పేరు ఉండదు. వారిని అధ్యక్షులుగా చేసినా వారు చెప్పేది హీరోలు వినాలా.. అంటారు. పైగా హీరోలకు ఫాలోయింగ్ ఎక్కువ. వారు ఏం చెప్పినా.. ఎవరికి చెప్పినా వింటారు.. కనుక మా అసోసియేషన్ మొదలైన కొత్తలో అధ్యక్షుడిగా హీరోలను ఉండాలనే నిర్ణయించాం.. అని మురళీ మోహన్ తెలిపారు.
కాగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు పనిచేశారు. వెంకటేష్ను కూడా ఆ పదవి చేపట్టాలని కోరాం. నటీనటులం అందరం, టాలీవుడ్ మొత్తం కలసి ఆయన ఇంటికి వెళ్లి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చేయాలని విజ్ఞప్తి చేశాం. అయితే ఆయన ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇలాంటి బాధ్యతలు చేపట్టలేనని, తాను సరిగ్గా మాట్లాడలేనని, మొహమాటం ఎక్కువని.. కనుక తనను వదిలేయాలని వెంకటేష్ కోరాడు. అయితే మేం అందరం బతిమాలి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా అయినా ఉండాలని ఒప్పించాం.. అలా వెంకటేష్ చాలా మొహమాటంతోపాటు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండేవారు.. అని మురళీ మోహన్ తెలియజేశారు. దీంతో వెంకటేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…