Venkatesh : తెలుగు సినీ ప్రేక్షకులకు విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరీర్ తొలినాళ్లలో చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అందుకనే విక్టరీని తన పేరుకు తగిలించుకున్నారు. ఇక వెంకటేష్తోపాటు ఆయన కుటుంబం మొత్తం లో ప్రొఫైల్ ను మెయింటెయిన్ చేస్తారు. వారు ఎక్కువగా బయట కనబడరు. కానీ వెంకటేష్ మాత్రం ఎప్పుడో మరీ ముఖ్యమైన ఫంక్షన్ ఉంటే తప్ప వెళ్లరు. అలాగే ఇతర సినిమాలకు చెందిన ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ ఈయన కనిపించేది తక్కువే.
ఇక వెంకటేష్ ఇప్పటి వరకు వివాద రహితుడిగా ఉన్నారు. ఆయన అవసరమైన విషయాల జోలికి వెళ్లరు. ఏ వివాదంలోనూ చిక్కుకున్న దాఖలాలు లేవు. ఎక్కడ ఎలా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి.. ఎక్కడ తగ్గి ఉండాలి.. అనే విషయం కచ్చితంగా తెలిసి ఉన్న వ్యక్తి వెంకటేష్. అయితే సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈ మధ్యే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ వెంకటేష్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు.
వెంకటేష్కు మొహమాటం ఎక్కువని మురళీ మోహన్ తెలిపారు. మా అసోసియేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి అధ్యక్షుడి స్థానంలో హీరోలనే ఉండాలని నిర్ణయించాం. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్లు, ఇతర చిత్ర యూనిట్కు చెందిన వారు అయితే పెద్దగా పేరు ఉండదు. వారిని అధ్యక్షులుగా చేసినా వారు చెప్పేది హీరోలు వినాలా.. అంటారు. పైగా హీరోలకు ఫాలోయింగ్ ఎక్కువ. వారు ఏం చెప్పినా.. ఎవరికి చెప్పినా వింటారు.. కనుక మా అసోసియేషన్ మొదలైన కొత్తలో అధ్యక్షుడిగా హీరోలను ఉండాలనే నిర్ణయించాం.. అని మురళీ మోహన్ తెలిపారు.
కాగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు పనిచేశారు. వెంకటేష్ను కూడా ఆ పదవి చేపట్టాలని కోరాం. నటీనటులం అందరం, టాలీవుడ్ మొత్తం కలసి ఆయన ఇంటికి వెళ్లి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చేయాలని విజ్ఞప్తి చేశాం. అయితే ఆయన ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇలాంటి బాధ్యతలు చేపట్టలేనని, తాను సరిగ్గా మాట్లాడలేనని, మొహమాటం ఎక్కువని.. కనుక తనను వదిలేయాలని వెంకటేష్ కోరాడు. అయితే మేం అందరం బతిమాలి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా అయినా ఉండాలని ఒప్పించాం.. అలా వెంకటేష్ చాలా మొహమాటంతోపాటు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండేవారు.. అని మురళీ మోహన్ తెలియజేశారు. దీంతో వెంకటేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…