అతను ఎంతో చదువుకున్నాడు.. ఫోరెన్సిక్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నాడు.. కానీ అతని మతిస్థిమితం సరిగ్గా లేదు. దీంతో అతను కరోనా వస్తుందేమోనన్న భయంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను అతి దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కాన్పూర్లోని కల్యాణ్పూర్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఫోరెన్సిక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అయితే అతను కరోనా కొత్త వేరియెంట్ వస్తుందేమోనని భయపడి భార్య గొంతుకు తీగను బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తరువాత సుత్తితో తన ఇద్దరు పిల్లల తలలపై బలంగా మోది హత్య చేశాడు. అనంతరం తన ఇంటి నుంచి పారిపోయాడు.
అలా అతను పారిపోతూ తన సోదరుడికి వాట్సాప్లో మెసేజ్ చేశాడు. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని, అది ప్రపంచంలో ఎవరినీ విడిచిపెట్టదని, అందరినీ చంపుతుందని, అందుకనే దాన్నుంచి అందరికీ విముక్తి కల్పిస్తున్నానని.. అతను వాట్సాప్ మెసేజ్ చేశాడు. అది చదివిని అతని సోదరుడు వెంటనే ఆ ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని చూశాడు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. ఆ ప్రొఫెసర్పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. కాగా ఆ ప్రొఫెసర్ గత కొంత కాలంగా తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నాడని, అందుకు అతను చికిత్స కూడా తీసుకుంటున్నాడని వెల్లడైంది. గతంలో ఒకసారి భార్యను చంపబోయాడని కూడా తెలిపారు. అయితే ఈసారి నిజంగానే తన కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…