అతను ఎంతో చదువుకున్నాడు.. ఫోరెన్సిక్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నాడు.. కానీ అతని మతిస్థిమితం సరిగ్గా లేదు. దీంతో అతను కరోనా వస్తుందేమోనన్న భయంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను అతి దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కాన్పూర్లోని కల్యాణ్పూర్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఫోరెన్సిక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అయితే అతను కరోనా కొత్త వేరియెంట్ వస్తుందేమోనని భయపడి భార్య గొంతుకు తీగను బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తరువాత సుత్తితో తన ఇద్దరు పిల్లల తలలపై బలంగా మోది హత్య చేశాడు. అనంతరం తన ఇంటి నుంచి పారిపోయాడు.
అలా అతను పారిపోతూ తన సోదరుడికి వాట్సాప్లో మెసేజ్ చేశాడు. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని, అది ప్రపంచంలో ఎవరినీ విడిచిపెట్టదని, అందరినీ చంపుతుందని, అందుకనే దాన్నుంచి అందరికీ విముక్తి కల్పిస్తున్నానని.. అతను వాట్సాప్ మెసేజ్ చేశాడు. అది చదివిని అతని సోదరుడు వెంటనే ఆ ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని చూశాడు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. ఆ ప్రొఫెసర్పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. కాగా ఆ ప్రొఫెసర్ గత కొంత కాలంగా తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నాడని, అందుకు అతను చికిత్స కూడా తీసుకుంటున్నాడని వెల్లడైంది. గతంలో ఒకసారి భార్యను చంపబోయాడని కూడా తెలిపారు. అయితే ఈసారి నిజంగానే తన కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…