Samantha Naga Chaithanya : ప్రస్తుతం సమంత నాగ చైతన్యల విడాకుల విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు. అంటూ వచ్చిన వార్తలను ఎట్టకేలకు ఈ జంట నిజమని తెలుపుతూ అభిమానులకు చేదు వార్తను తెలియజేశారు. గత కొద్ది రోజుల నుంచి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై నాగచైతన్య స్పందిస్తూ విడాకులు తీసుకోబోతున్నామని అధికారిక ప్రకటన చేశారు.
ఇకపోతే ఏం మాయ చేశావే సినిమా ద్వారా మొట్టమొదటిసారి తెరపై సందడి చేసిన వీరు ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి చిత్రాలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం 2017లో పెళ్లి బంధంతో ఒకటవడం జరిగింది. ఇదిలా ఉండగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ వెకేషన్ కి వెళ్లే వీరు చివరిసారిగా సమంత సామ్ జామ్ అనే కార్యక్రమంలో ఇద్దరూ కలిసి ఎంతో అన్యోన్యంగా కనిపించారు.
ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎడబాటు కనిపించింది. సమంత ఒంటరిగా తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లడం, తన మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ ఆ వేడుకలలో పాల్గొనకపోవడం, చైతు లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో లేకపోవడం.. అభిమానులలో మరిన్ని సందేహాలకు కారణమయ్యాయి.
ఈ విధంగా వీరిద్దరూ విడిపోవడానికి బలమైన కారణం ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో రాజీ అనే పాత్రలో ఎంతో బోల్డ్ గా నటించిన సమంత ఈ సిరీస్ ద్వారా అక్కినేని కుటుంబంతో తనకు మనస్పర్థలు వచ్చాయని.. అందుకే విడాకులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ నేడు నాగచైతన్య అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే వీరి విడాకుల్లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చివరి వరకు వీరిని కలిపి ఉంచేందుకు యత్నించినా ఆ ప్రయత్నం విఫలమైందని సమాచారం. అందువల్లే ఇక విడాకులు తప్పదని భావించి వీరు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారని తెలుస్తోంది. అయితే సమంత దూరమైంది కనుక వీరి విడాకులు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…