Samantha Naga Chaithanya : ప్రస్తుతం సమంత నాగ చైతన్యల విడాకుల విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు. అంటూ వచ్చిన వార్తలను ఎట్టకేలకు ఈ జంట నిజమని తెలుపుతూ అభిమానులకు చేదు వార్తను తెలియజేశారు. గత కొద్ది రోజుల నుంచి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై నాగచైతన్య స్పందిస్తూ విడాకులు తీసుకోబోతున్నామని అధికారిక ప్రకటన చేశారు.
ఇకపోతే ఏం మాయ చేశావే సినిమా ద్వారా మొట్టమొదటిసారి తెరపై సందడి చేసిన వీరు ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి చిత్రాలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం 2017లో పెళ్లి బంధంతో ఒకటవడం జరిగింది. ఇదిలా ఉండగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ వెకేషన్ కి వెళ్లే వీరు చివరిసారిగా సమంత సామ్ జామ్ అనే కార్యక్రమంలో ఇద్దరూ కలిసి ఎంతో అన్యోన్యంగా కనిపించారు.
ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎడబాటు కనిపించింది. సమంత ఒంటరిగా తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లడం, తన మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ ఆ వేడుకలలో పాల్గొనకపోవడం, చైతు లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో లేకపోవడం.. అభిమానులలో మరిన్ని సందేహాలకు కారణమయ్యాయి.
ఈ విధంగా వీరిద్దరూ విడిపోవడానికి బలమైన కారణం ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో రాజీ అనే పాత్రలో ఎంతో బోల్డ్ గా నటించిన సమంత ఈ సిరీస్ ద్వారా అక్కినేని కుటుంబంతో తనకు మనస్పర్థలు వచ్చాయని.. అందుకే విడాకులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ నేడు నాగచైతన్య అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే వీరి విడాకుల్లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చివరి వరకు వీరిని కలిపి ఉంచేందుకు యత్నించినా ఆ ప్రయత్నం విఫలమైందని సమాచారం. అందువల్లే ఇక విడాకులు తప్పదని భావించి వీరు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారని తెలుస్తోంది. అయితే సమంత దూరమైంది కనుక వీరి విడాకులు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…