Uday Kiran : చాలా తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తరవాత నువ్వు నేను, మనసంతానువ్వే చిత్రాలతో సక్సస్ ని అందుకుని హ్యాట్రిక్ హీరోగా, లవర్ బాయ్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఈ సక్సెస్ లతో ఉదయ్ కిరణ్ కి ఆఫర్లు క్యూ కట్టాయి. అప్పట్లోనే ఉదయ్ అగ్ర హీరోలకు దీటుగా ఎదగడం ప్రారంభించాడు. అంతే కాకుండా స్టార్ డైరెక్టర్లు కూడా డేట్స్ కోసం ఎదరు చూసే స్థాయికి ఉదయ్ కిరణ్ చేరుకున్నాడు.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉదయ్ కిరణ్ సహజమైన నటనతో ఇండస్ట్రీలో హీరోగా మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల సినిమా అవకాశాలు తగ్గటం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలోనే విషితను వివాహం చేసుకోవడం, అక్కడ కూడా సమస్యలు ఎదురవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ చివరకు ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ కు సినీ పరిశ్రమలో ఉన్న స్నేహితుల్లో హీరో అల్లరి నరేష్ కూడా ఒకరు. నరేష్, ఉదయ్ కిరణ్ గురించి ఓ ఇంటర్య్వూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు హీరో నరేష్ ఆయనను కలవటం జరిగిందట. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ ముఖంలో దిగులు, బాధ కనిపించాయట. దాంతో ఎందుకు ఉదయ్ అలా డల్ గా ఉన్నావు అని ప్రశ్నించాను అని నరేష్ తెలియజేశాడు. నరేష్ ప్రశ్నకు సమాధానంగా ఉదయ్ కిరణ్ ఓ పేపర్ లో యంగ్ హీరో కథలు సరిగ్గా ఎంచుకోవడం లేదని రాశారని ఆవేదన వ్యక్తం చేశాడట. దానికి నరేష్ ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు. నీకు సంబంధించిన విషయం కాదు కదా అని అన్నానని తెలిపాడు నరేష్.
దాంతో ఉదయ్ కిరణ్ ఆ యంగ్ హీరో కథలు సరిగ్గా ఎంచుకోకపోతే అతడికి కూడా ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే పడుతుందని ఆ పేపర్ లో రాశారని బాధపడ్డాడట. దాంతో నరేష్.. ఉదయ్ కిరణ్ ని చూసి ఉద్వేగానికి గురయ్యాడట. ఆ విషయంతో ఉదయ్ కిరణ్ ఎంతో డిప్రెషన్ లో ఉన్నాడని నరేష్ కి అర్థమైందట. ఇక ఉదయ్ కిరణ్ చనిపోయిన తరవాత అతడి మృతికి డిప్రెషన్ కూడా కారణమని నరేష్ కు అనిపించిందని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…