Tripuraneni Chittibabu : పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం భారీ అంచనాలతో గత నెల ఆగస్టు 25న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఊహలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. రూ.120 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టం చవి చూపించింది. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ రావటంతో సినీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాట తీరుపై సినీ ప్రముఖులు చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత చిట్టి బాబు.. విజయ్ దేవరకొండ మాటతీరుపై స్పందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్టార్ అనేవారు మీ పని ఎంతవరకు, మీ సినిమా విషయాలు ఏంటో అవి మాత్రమే మాట్లాడాలి. పెళ్లిచూపులు చిత్రంతో సక్సెస్ను అందుకున్న విజయ్ దేవరకొండకి సినిమా ఫీల్డ్ లోకి ఎంటరైన తరువాత చాలా ఫాస్ట్ గా అతనికి స్టార్ డమ్ అనేది వచ్చింది. స్టార్ డమ్ పెరగడంతో విజయ్ దేవరకొండకు నోరు కంట్రోల్ లేకుండా పోయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలో.. ఎలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలో తెలియకుండా డిసిప్లేన్ లేకుండా సినిమాల్లో మాదిరిగా ఒక రౌడీ మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు.
ఒక హిట్ వచ్చినంత మాత్రాన మనం ఏది మాట్లాడితే అది చెల్లిపోతుందని అనుకోకూడదు. కెరియర్లో నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయం ఎన్టీఆర్ ని చూసి నేర్చుకో. ఎంత పెద్ద హీరో అయినా కూడా పబ్లిక్ లో మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడతాడు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఒకరిని పరోక్షంగా విమర్శించడం కూడా చేయలేదు. నీ ఇష్టం వచ్చినట్లు ఆటిట్యూడ్ చూపిస్తే పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది అంటూ నిర్మాత చిట్టి బాబు విజయ్ దేవరకొండపై ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా లైగర్ చిత్రం డిజాస్టర్ అవడం అనేది విజయ్ దేవరకొండకి ఒక గుణపాఠంగా భావిస్తున్నానని నేను అనుకుంటున్న అంటూ నిర్మాత చిట్టి బాబు వెల్లడించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…