Tripuraneni Chittibabu : పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం భారీ అంచనాలతో గత నెల ఆగస్టు 25న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఊహలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. రూ.120 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టం చవి చూపించింది. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ రావటంతో సినీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాట తీరుపై సినీ ప్రముఖులు చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత చిట్టి బాబు.. విజయ్ దేవరకొండ మాటతీరుపై స్పందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్టార్ అనేవారు మీ పని ఎంతవరకు, మీ సినిమా విషయాలు ఏంటో అవి మాత్రమే మాట్లాడాలి. పెళ్లిచూపులు చిత్రంతో సక్సెస్ను అందుకున్న విజయ్ దేవరకొండకి సినిమా ఫీల్డ్ లోకి ఎంటరైన తరువాత చాలా ఫాస్ట్ గా అతనికి స్టార్ డమ్ అనేది వచ్చింది. స్టార్ డమ్ పెరగడంతో విజయ్ దేవరకొండకు నోరు కంట్రోల్ లేకుండా పోయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలో.. ఎలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలో తెలియకుండా డిసిప్లేన్ లేకుండా సినిమాల్లో మాదిరిగా ఒక రౌడీ మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు.
ఒక హిట్ వచ్చినంత మాత్రాన మనం ఏది మాట్లాడితే అది చెల్లిపోతుందని అనుకోకూడదు. కెరియర్లో నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయం ఎన్టీఆర్ ని చూసి నేర్చుకో. ఎంత పెద్ద హీరో అయినా కూడా పబ్లిక్ లో మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడతాడు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఒకరిని పరోక్షంగా విమర్శించడం కూడా చేయలేదు. నీ ఇష్టం వచ్చినట్లు ఆటిట్యూడ్ చూపిస్తే పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది అంటూ నిర్మాత చిట్టి బాబు విజయ్ దేవరకొండపై ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా లైగర్ చిత్రం డిజాస్టర్ అవడం అనేది విజయ్ దేవరకొండకి ఒక గుణపాఠంగా భావిస్తున్నానని నేను అనుకుంటున్న అంటూ నిర్మాత చిట్టి బాబు వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…