Traffic Challan : రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ చలాన్లపై అందిస్తున్న రాయితీ ఆఫర్ను మరికొద్ది రోజుల పాటు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే మరో 15 రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ చలాన్లపై భారీ ఎత్తున రాయితీ అందిస్తుండడంతో వాహనదారులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ చలాన్లను చెల్లిస్తున్నారు. దీంతో ఈ ఆఫర్కు లభిస్తున్న స్పందనను చూసి మరికొద్ది రోజుల పాటు ఇందుకు గడువును పెంచుతున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ చలాన్లు ఇప్పటికే భారీ ఎత్తున రాష్ట్రంలో పెండింగ్లో ఉండగా.. వాటిని ఎలా క్లియర్ చేయాలో ఆ శాఖ అధికారులకు తెలియడం లేదు. దీంతో మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు ట్రాఫిక్ చలాన్లపై భారీ ఎత్తున రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ద్వి, త్రిచక్ర వాహనాలకు 75 శాతం, కార్లు, లారీలు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతంతోపాటు కరోనా కాలంలో మాస్క్ ధరించకుండా ప్రయాణించిన వారికి ట్రాఫిక్ చలాన్లపై ఏకంగా 90 శాతం రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఇలా ఆఫర్ను అందించడంతో వాహనదారులు పెద్ద ఎత్తున ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల మేర చలాన్లను చెల్లించారు. ఈ క్రమంలోనే మార్చి 31వ తేదీ వరకు గడువు ముగిసింది. అయితే ఈ ఆఫర్కు వచ్చిన స్పందనతోపాటు వాహనదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ ఆఫర్కు గడువును మరికొన్ని రోజుల పాటు పెంచారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువును పెంచారు. దీంతో మరింత మంది వాహనదారులకు ఊరట లభించనుంది. అలాగే ఇంకా భారీగానే చలాన్లు వసూలు అవుతాయని భావిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…