Tollywood : గతేడాది అక్టోబర్ మొదటి వారంలో సమంత, నాగచైతన్య ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. వీరి విడాకుల వార్త అప్పట్లో పెను దుమారం రేపింది. అక్కినేని అభిమానులు ఈ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోయారు. అందుకనే ఇప్పటికీ వారు సమంతను టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఆ తరువాత జనవరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తమిళ స్టార్ నటుడు ధనుష్ విడాకులు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలా చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో విడాకులు అనేవి సర్వ సాధారణం అయిపోయాయి.
అయితే ఇటీవల మెగాస్టార్ చిన్నకుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతులు కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇప్పటికే విడిగా ఉంటున్నారని స్పష్టమైంది. దీంతో ఎప్పుడైనా వీరు విడాకులు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ జంట విడాకులకు అప్లై చేసిందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, ఆయన భార్య రూప విడాకుల కోసం కోర్టులో అప్లై చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ నాంపల్లి కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
కాగా శ్రీనువైట్ల, రూప ఇద్దరూ గత నాలుగేళ్ల నుంచి విడిగా ఉంటున్నారని తెలిసింది. కనుకనే వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. వీరిమధ్య మనస్ఫర్థలు వస్తుండడం వల్లే వీరు విడిగా ఉంటున్నారని.. ఇక కలవడం సాధ్యపడడం లేదని.. కనుకనే విడాకులకు దరఖాస్తు చేశారని తెలుస్తోంది. ఇక శ్రీను వైట్ల ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి ఢీ అంటే ఢీ నిర్మిస్తున్నారు. ఈయన సినిమాలు వచ్చి చాలా కాలమే అవుతోంది. గతంలో మహేష్ బాబుతో దూకుడు, ఎన్టీఆర్తో బాద్ షా వంటి సక్సెస్ ఫుల్ హిట్స్ను ఈయన అందించారు. తరువాత ఈయన కెరీర్ కాస్త నెమ్మదించింది. మరి ముందు ముందు అయినా ఈయన మళ్లీ పుంజుకుంటారేమో చూడాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…