Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మొదట్లో టీడీపీలో ఉండేది. తరువాత వైసీపీలోకి వచ్చింది. ఆ తరువాత ఎమ్మెల్యే అయి ఇప్పుడు మంత్రిగా హోదాను అనుభవిస్తున్నారు. అలాగే మంత్రి అవకముందు వరకు ఈమె జబర్దస్త్ షోలో జడ్జిగా చేశారు. పలు ఇతర షోలలోనూ హోస్ట్గా చేశారు. ఇక రోజా భర్త సెల్వమణి అన్న విషయం తెలిసిందే. ఈయన ప్రముఖ దర్శకుడు. కానీ ఇప్పుడు సినిమాలు ఏవీ చేయడం లేదు. ఈమెకు కుమారుడు కృష్ణ లోహిత్, కుమార్తె అన్షుమాలిక ఉన్నారు. వీరిద్దరూ చదువుల్లో రాణిస్తున్నారు.
కాగా మంత్రి రోజాకు భారీగా ఆస్తులు ఉన్నాయని అందరూ అనుకుంటారు. కానీ ఆమెకు ఉన్న ఆస్తులు తక్కువే. ఈ మధ్యే ఆమె ఒక మెర్సిడెస్ బెంజ్ కారును కొన్నారు. దాని విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని సమాచారం. దీంతో రోజా ఆస్తుల విషయం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే రోజాకు అసలు ఆస్తులు ఎంత ఉన్నాయి.. అని అందరూ ఆరాలు తీస్తున్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్లో మాత్రం తన ఆస్తుల విలువ రూ.7.38 కోట్లు అని తెలియజేశారు.
రోజా తన ఆస్తి విలువ రూ.7.38 కోట్లు ఉంటుందని అప్పట్లో అఫిడవిట్లో చెప్పారు. అది ఇప్పటికి మూడేళ్లు అయిపోయింది కనుక ఆమె ఆస్తులు ఇంకాస్త పెరిగి ఉంటాయని సమాచారం. ఇక అప్పటి ప్రకారం అయితే ఆ ఆస్తి విలువలో స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉండగా, చరాస్తులు రూ.2.74 కోట్ల వరకు ఉన్నాయి. ఆమెకు రూ.49 లక్షల అప్పు ఉన్నట్లు చెప్పారు.
రోజా కుమారుడు కృష్ణ లోహిత్, కుమార్తె అన్షుమాలికల పేరిట బ్యాంకుల్లో చెరో రూ.50 లక్షల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అలాగే రోజాకు రూ.1 కోటి విలువ చేసే కార్లు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఫార్చూనర్, ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా స్కార్పియోలతోపాటు ఇంకో ఫోర్డ్ కారు కూడా ఉంది. ఇక ఆమె భర్త సెల్వమణికి స్థిరాస్తులు ఏమీ లేవని చెప్పారు. అప్పు రూ.22 లక్షలు ఉండగా.. ఆయనకు రూ.58 లక్షల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ వివరాలను ఆమె అప్పట్లో అఫిడవిట్లో చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె ఆస్తి రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…