Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మొదట్లో టీడీపీలో ఉండేది. తరువాత వైసీపీలోకి వచ్చింది. ఆ తరువాత ఎమ్మెల్యే అయి ఇప్పుడు మంత్రిగా హోదాను అనుభవిస్తున్నారు. అలాగే మంత్రి అవకముందు వరకు ఈమె జబర్దస్త్ షోలో జడ్జిగా చేశారు. పలు ఇతర షోలలోనూ హోస్ట్గా చేశారు. ఇక రోజా భర్త సెల్వమణి అన్న విషయం తెలిసిందే. ఈయన ప్రముఖ దర్శకుడు. కానీ ఇప్పుడు సినిమాలు ఏవీ చేయడం లేదు. ఈమెకు కుమారుడు కృష్ణ లోహిత్, కుమార్తె అన్షుమాలిక ఉన్నారు. వీరిద్దరూ చదువుల్లో రాణిస్తున్నారు.
కాగా మంత్రి రోజాకు భారీగా ఆస్తులు ఉన్నాయని అందరూ అనుకుంటారు. కానీ ఆమెకు ఉన్న ఆస్తులు తక్కువే. ఈ మధ్యే ఆమె ఒక మెర్సిడెస్ బెంజ్ కారును కొన్నారు. దాని విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని సమాచారం. దీంతో రోజా ఆస్తుల విషయం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే రోజాకు అసలు ఆస్తులు ఎంత ఉన్నాయి.. అని అందరూ ఆరాలు తీస్తున్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్లో మాత్రం తన ఆస్తుల విలువ రూ.7.38 కోట్లు అని తెలియజేశారు.
రోజా తన ఆస్తి విలువ రూ.7.38 కోట్లు ఉంటుందని అప్పట్లో అఫిడవిట్లో చెప్పారు. అది ఇప్పటికి మూడేళ్లు అయిపోయింది కనుక ఆమె ఆస్తులు ఇంకాస్త పెరిగి ఉంటాయని సమాచారం. ఇక అప్పటి ప్రకారం అయితే ఆ ఆస్తి విలువలో స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉండగా, చరాస్తులు రూ.2.74 కోట్ల వరకు ఉన్నాయి. ఆమెకు రూ.49 లక్షల అప్పు ఉన్నట్లు చెప్పారు.
రోజా కుమారుడు కృష్ణ లోహిత్, కుమార్తె అన్షుమాలికల పేరిట బ్యాంకుల్లో చెరో రూ.50 లక్షల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అలాగే రోజాకు రూ.1 కోటి విలువ చేసే కార్లు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఫార్చూనర్, ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా స్కార్పియోలతోపాటు ఇంకో ఫోర్డ్ కారు కూడా ఉంది. ఇక ఆమె భర్త సెల్వమణికి స్థిరాస్తులు ఏమీ లేవని చెప్పారు. అప్పు రూ.22 లక్షలు ఉండగా.. ఆయనకు రూ.58 లక్షల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ వివరాలను ఆమె అప్పట్లో అఫిడవిట్లో చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె ఆస్తి రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…