ఒక నీచుడు చేసిన పనికి ఆ పిల్లలకు తల్లి దూరమైంది.. ఎవరికీ ఇలా జరగకూడదు..

ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను అమలులోకి తెచ్చినా, ఎంతో కఠినమైన శిక్షలు వేస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఎన్నోరకాల చట్టాల ద్వారా నిందితులు సురక్షితంగా బయటకు రావడం వల్ల ఎన్నో దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని భవానా ప్రాంతంలో రెండు వారాల క్రితం ఒక మహిళపై యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు ఆ వివాహితపై యాసిడ్ దాడి జరగడానికి కారణమేమిటనే విషయానికి వస్తే..

ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఓ 26 ఏళ్ల వివాహిత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త రోజు కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మొంటూ అనే 23 సంవత్సరాల యువకుడు ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతను ఒత్తిడి చేయడంతో.. ఆమె.. నాకు పెళ్లి అయింది, ముగ్గురు పిల్లలు ఉన్నారు, పెళ్లయిన మహిళను ఇష్టపడటం మంచి పద్ధతి కాదు.. అంటూ అతనికి అర్థమయ్యేలా వివరించింది.

అయితే ఆమె నవంబర్ 3వ తేదీన బయటకు వెళ్లిన సమయంలో మొంటూ అడ్డుపడి తనను పెళ్లి చేసుకోవాలని మరోమారు ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే ఆమె చాలా గట్టిగా అతనికి వార్నింగ్ ఇచ్చింది. అయితే ముందుగానే ఆమెపై యాసిడ్ దాడి చేయాలని పథకం వేసుకుని అతను తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను ఆమెపై పోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ క్రమంలో స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అసలు విషయం తెలుసుకున్న ఆమె భర్త ముందుగా తనకు ఒక్క మాట చెప్పి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇన్ని రోజులూ తన బిడ్డలు అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగితే వస్తుంది అని చెప్పాను ఇప్పుడు వారికి నేనేమి సమాధానం చెప్పాలి, ఏంటి మాకు ఈ పరీక్ష.. అంటూ విలపించాడు. ఇక విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో అతనిని కఠినంగా శిక్షించాలని, అతనికి ఉరి శిక్ష పడేలా చేయాలంటూ.. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM

త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’

త‌మిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను న‌టి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు త్రిష త‌న…

Monday, 9 March 2026, 3:22 PM

బెంగళూరులో ఎన్టీఆర్ మేనియా.. ఆసుపత్రి ఓపెనింగ్‌లో భారీ తోపులాట, ఎస్కలేటర్ ధ్వంసం!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…

Monday, 9 March 2026, 10:01 AM

బెల్లంకొండ ఇంట్లో పెళ్లి సందడి.. వైభవంగా శ్రీనివాస్ నిశ్చితార్థం..

టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్ట‌నున్నారు. త‌న ప్రియురాలు కావ్య‌తో ఆయ‌న నిశ్చితార్థం ఆదివారం (మార్చి…

Sunday, 8 March 2026, 8:36 PM