తన శరీరంలోని చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు దళితుల కోసం పోరాటం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం విదితమే. కాగా ఈ పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడ్డామని అన్నారు. అదేవిధంగా దళిత బంధు కోసం కూడా పోరాటం చేస్తామని అన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేస్తామని అన్నారు. తన శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఈ పథకం కోసం, దళితుల అభివృద్ధి కోసం పోరాడుతానని అన్నారు.
ఎన్నో ఏళ్లుగా దళితల జాతి పేదరికంలో మగ్గిపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు సభ్య సమాజమే కారణమన్నారు. దళితులు సామాజిక వివక్షకు గురవుతున్నారని తెలిపారు. దళితుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని విడనాడాలని అన్నారు. వారు అన్ని రంగాల్లోనూ ఎదగాలని, అందుకు గాను సమాజం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…