శ్రీ కృష్ణాష్టమి పండగను ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. ఆ రోజు ఇంట్లో చిన్నపిల్లలను శ్రీ కృష్ణుడిలా, గోపికలలా తయారుచేసి బాగా సందడిగా జరుపుకుంటారు. తమ చిన్ని శ్రీకృష్ణులతో తమ ఇల్లు మొత్తం అడుగులతో నింపుతారు. ఇక ఈ పండుగను శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగను కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని పిలుస్తుంటారు. ఈ పండుగ రోజు ఉదయాన్నే స్నానమాచరించి షోడశోపచారాలతో కృష్ణుడికి పూజలు చేస్తారు.
ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమకూర్చుతారు. ఇంటిని మామిడాకు తోరణాలతో, పువ్వులతో అలంకరిస్తారు. శ్రీ కృష్ణ విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి కొత్త వస్త్రాలను ధరిస్తారు. పువ్వులతో, ధూప దీపాలతో, నైవేద్యాలతో ఆయనకు పూజలు చేస్తారు. పూజ చేసే సమయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా దేవుడిపై మనసును నిమగ్నం చేయాలి.
కృష్ణుని తలుచుకొని అర్చిస్తే పాపాలు పోతాయి. బంగారం లేదా వెండితో లేదా చంద్రబింబాన్ని తయారుచేసి వెండి లేదా బంగారు పాత్రలో ఉంచి పూజ చేస్తే కోరికలు తీరుతాయి. సకల పాపాలు తొలగుతాయి. సంతానం లేనివారు సంతాన గోపాల మంత్రంతో కృష్ణుని పూజిస్తే వెంటనే సంతానం కలుగుతుంది. ఇక పెళ్ళి కాని వారు రుక్మిణి కళ్యాణ పారాయణం చేసినట్లైతే పెళ్లి జరుగుతుంది. ఇక ముఖ్యంగా గోవులకు ఆహారం పెడితే ప్రతి దేవుడి ఆశీస్సులు ఉంటాయి. ఆ రోజు భక్తులు కృష్ణుడికి ఇష్టమైన ఆట ఉట్టి కొట్టడం వంటి సంబరాలు కూడా చేసుకుంటారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…