కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ లాక్డౌన్ను అమలు చేస్తుండగా లాక్ డౌన్ను అమలు చేయని ఏకైక దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై రోజు రోజుకీ ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు హైకోర్టు విచారిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్పై రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంగళవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలా, వద్దా అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను చర్చించాక కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే తెలంగాణలో టెస్టులు తక్కువ చేస్తున్నారు కనుక తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయనే అపవాదు ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే లాక్ డౌన్పై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. కానీ మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరి సీఎం కేసీఆర్ లాక్డౌన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…