కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ లాక్డౌన్ను అమలు చేస్తుండగా లాక్ డౌన్ను అమలు చేయని ఏకైక దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై రోజు రోజుకీ ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు హైకోర్టు విచారిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్పై రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంగళవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలా, వద్దా అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను చర్చించాక కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే తెలంగాణలో టెస్టులు తక్కువ చేస్తున్నారు కనుక తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయనే అపవాదు ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే లాక్ డౌన్పై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. కానీ మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరి సీఎం కేసీఆర్ లాక్డౌన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…