కరోనా నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటి వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను విధించి అమలు చేసిన సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ కేసుల సంఖ్య తగ్గడంతో లాక్డౌన్ సమయాలను తగ్గిస్తూ వచ్చారు. అయినప్పటికీ లాక్ డౌన్ సమయంలోనూ కొందరు రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారి వాహనాలను సీజ్ చేశారు. అయితే ఆ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో కోవిడ్ ఆంక్షల సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి వాహనాలు సీజ్ చేయబడిన వారు తమ వాహనాలను జరిమానా చెల్లించి మళ్లీ వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు వాహనాలను తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీల కార్యాలయాలు, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది.
వాహనదారులు జరిమానాను ఆన్లైన్లోనూ చెల్లించి తమ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చు. అయితే తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో మాత్రం వాహనదారులు కోర్టులో హాజరు కావల్సి ఉంటుంది. కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం వాహనాలను అందిస్తారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…