పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ లో మరమరాల కట్లెట్ ఒకటి అని చెప్పవచ్చు. మరి మరమరాల కట్లెట్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*మరమరాలు రెండు కప్పులు
*క్యారెట్ తురుము అరకప్పు
*బంగాళాదుంప గుజ్జు పావు కప్పు
*గరంమసాలా టేబుల్ స్పూన్
*ఉల్లిపాయ ముక్కలు గుప్పెడు
*పచ్చిమిర్చి 2
*కోడిగుడ్డు ఒకటి
*చీజ్ తురుము రెండు టేబుల్ స్పూన్లు
*బ్రెడ్ పౌడర్ అర కప్పు
*ఉప్పు తగినంత
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోకి క్యారెట్ తురుము, గరం మసాలా వేసి కొద్దిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఈ మిశ్రమం చల్లారిన తరవాత బంగాళదుంప గుజ్జు అప్పుడే నీటిలో నానబెట్టుకున్న మరమరాలు, చీజ్ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజులో తయారు చేసుకొని వాటిని గుడ్డు మిశ్రమంలో అద్ది బ్రెడ్ పౌడర్ లో అటు ఇటు తిప్పుతూ నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన మరమరాల తయారైనట్లే.వేడి వేడిగా ఉండే మరమరాల కట్లెట్ టమోటో సాస్ తో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…