దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ మహమ్మారి గురించి ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ప్రజలలో అవగాహన చేపట్టారు. ఈ మహమ్మారి పట్ల అందరికీ అవగాహన కల్పించడం కోసం గత ఏడాది మార్చి నెలనుంచి తన బైక్ పై మైకులు పెట్టుకుని సుమారుగా 15 వేల కిలోమీటర్లు తిరిగి కరోనా గురించి ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కల్పించిన వ్యక్తి ప్రస్తుతం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
గన్నేరువరం మండలం చీమలకుంట పల్లెకు చెందిన బామండ్ల రవీందర్ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేశాడు తన బండికి మైకు కట్టుకొని కరీంనగర్, జగిత్యాల,పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల ,సిద్ది పేట,వరంగల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో కరోనా బారినపడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలలో అవగాహన కల్పించారు.
ఈ విధంగా ప్రజలలో అవగాహన కల్పించిన రవీందర్ కుటుంబం మొత్తం తాజాగా కరోనా బారిన పడ్డారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ కరోనా నుంచి కోలుకోగా, రవీందర్ మాత్రం ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే
చికిత్సకు అయ్యే డబ్బులు లేక పోవడంతో భార్యాపిల్లలు ఆందోళన చెందుతున్నారు . ఎవరైనా దాతలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.రవీందర్ కూతురు అక్షర ‘ మా నాన్న చికిత్స కోసం డబ్బులు సాయం చేయండని ‘ సినీనటుడు సోనుసూద్ , ఇతరులను వేడుకుంటోంది. ప్రభుత్వం కూడా తన తండ్రి చికిత్సకోసం ఆదుకోవాలని అక్షర వేడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…