Rs 200 Notes : కేంద్రంలో మోదీ ప్రభుత్వం చాలా ఏళ్ల కిందట రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం విదితమే. నకిలీ నోట్లు, అవినీతి తదితర కారణాల వల్ల పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని అప్పటి ప్రభుత్వం తెలియజేసింది. అయితే నిజానికి నకిలీ నోట్లు రావడం కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ సమస్య కేవలం మన దేశంలోనే కాదు, అమెరికా వంటి అగ్రదేశాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సమస్య మనకు రూ.200 నోట్ల రూపంలో వచ్చింది. అవును, పలు చోట్ల రూ.200 నకిలీ నోట్లు చెలామణీ అవుతున్నట్లు గుర్తించారు.
వనపర్తి జిల్లాలో ఈ మధ్యకాలంలో రూ.200కు చెందిన నకిలీ నోట్ల చెలామణీ ఎక్కువైపోయింది. అక్కడ ఈ నోట్లను బాగా చెలామణీ చేస్తున్నారట. ఇవి అచ్చు గుద్దినట్లు ఒరిజినల్ నోట్లను పోలి ఉంటున్నాయట. దీంతో గుర్తించడం కష్టమవుతుందట. ఈ క్రమంలో నకిలీ నోట్లను తీసుకున్న వారు తమకు వచ్చినవి నకిలీవి అని తెలిసి వాపోతున్నారు. అసలు ఈ నోట్లను ఎలా చెలామణీ చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో రూ.500, రూ.1000 ఆ తరువాత వచ్చిన రూ.500, రూ.2000 నోట్లను కూడా నకిలీవి ప్రింట్ చేసి చెలామణీ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు రూ.200 నోట్లను కూడా చెలామణీ చేస్తున్నారని తెలుస్తుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఏది ఏమైనా మీరు రూ.200 నోట్లను తీసుకుంటున్నట్లయితే జాగ్రత్త. వాటిని పరిశీలించి తీసుకోండి. లేదంటే ఇబ్బందులు పడతారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…