ఖమ్మం జిల్లాలోని వేంసూరులో ఓ వ్యక్తి మృతదేహం పట్ల అమానుష ఘటన చోటుచేసుకుంది. వేంసూరులో అంబేద్కర్ కాలనీలో ఓ వ్యక్తి మరణించడంతో అతని దహన సంస్కారాలను కాలనీ సమీపంలోనే ఏర్పాటుచేయడంతో అసలు గొడవ మొదలైంది. ఇలా నివాస స్థలాలకు దగ్గరగా దహనసంస్కారాలు నిర్వహించడం వల్ల స్థానికంగా ఉండే ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. దహన సంస్కారాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వైకుంఠ ధామాన్ని నిర్మించింది.
ఇలా ప్రభుత్వం ప్రత్యేకంగా వైకుంఠధామాన్ని నిర్మించడంతో అప్పటినుంచి మరణించిన వారి మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా గురువారం అంబేద్కర్ కాలనీలో ఓ వ్యక్తి మరణించడంతో అతని కుటుంబ సభ్యులు అతనికి దహన సంస్కారాలు చేయడం కోసం కాలనీ సమీపంలోనే ఏర్పాట్లు చేయడంతో కాలనీవాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అంత్యక్రియలను అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఏకంగా ముందుగా దహన సంస్కారాల కోసం ఏర్పాటు చేసిన చితిపై ఎక్కి తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. ఈ విధంగా కొంత సమయం పాటు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మృతుడి బంధువులలో ఒకరు నచ్చ చెప్పగా చివరికి అంత్యక్రియలను నిర్వహించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…