ఖమ్మం జిల్లాలోని వేంసూరులో ఓ వ్యక్తి మృతదేహం పట్ల అమానుష ఘటన చోటుచేసుకుంది. వేంసూరులో అంబేద్కర్ కాలనీలో ఓ వ్యక్తి మరణించడంతో అతని దహన సంస్కారాలను కాలనీ సమీపంలోనే ఏర్పాటుచేయడంతో అసలు గొడవ మొదలైంది. ఇలా నివాస స్థలాలకు దగ్గరగా దహనసంస్కారాలు నిర్వహించడం వల్ల స్థానికంగా ఉండే ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. దహన సంస్కారాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వైకుంఠ ధామాన్ని నిర్మించింది.
ఇలా ప్రభుత్వం ప్రత్యేకంగా వైకుంఠధామాన్ని నిర్మించడంతో అప్పటినుంచి మరణించిన వారి మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా గురువారం అంబేద్కర్ కాలనీలో ఓ వ్యక్తి మరణించడంతో అతని కుటుంబ సభ్యులు అతనికి దహన సంస్కారాలు చేయడం కోసం కాలనీ సమీపంలోనే ఏర్పాట్లు చేయడంతో కాలనీవాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అంత్యక్రియలను అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఏకంగా ముందుగా దహన సంస్కారాల కోసం ఏర్పాటు చేసిన చితిపై ఎక్కి తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. ఈ విధంగా కొంత సమయం పాటు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మృతుడి బంధువులలో ఒకరు నచ్చ చెప్పగా చివరికి అంత్యక్రియలను నిర్వహించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…