దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రళయం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కొద్దిగా జలుబు, దగ్గు అనిపించిన ప్రజలు కరోనా పరీక్షల నిమిత్తం పరీక్ష కేంద్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. పరీక్షల అనంతరం రిపోర్టులు రావడానికి కూడా ఆలస్యం కావడంతో ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రిపోర్టులు కూడా ఒక్కో చోట ఒక్కో విధంగా వెలువడటంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తాజాగా బోధ్ మండలానికి చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెకు ఏకంగా మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. మొదటిసారిగా సొనాల పీహెచ్సీలో కరోనా పరీక్ష చేయించుకున్నారు. టెస్టులో నెగెటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చినా కూడా ఆమెకు లక్షణాలు తగ్గకపోవడంతో నిర్మల ఆస్పత్రిలో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు.అక్కడ ఆమెకు పాజిటివ్ అని రావడంతో రిపోర్టు పట్ల బాధిత కుటుంబం గందరగోళానికి గురైంది.
ఒకసారి నెగటివ్ మరోసారి పాజిటివ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ మహిళకు మూడోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో తీవ్రమైన అయోమయంలో పడ్డారు. ఈ రిపోర్టులను నమ్ముకుంటే పరిస్థితి తీవ్రతరం అవుతుందని భావించిన సదరు మహిళ హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు..
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…