Team India : సౌతాఫ్రికా చేతిలో ఇటీవల ఘోర పరాభవం ఎదుర్కొన్న భారత క్రికెట్ జట్టు సొంత దేశంలో వెస్టిండీస్తో రెండు సిరీస్లకు సిద్ధమవుతోంది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే రోహిత్ మళ్లీ టీమ్లోకి వచ్చేశాడు. వెస్టిండీస్తో భారత్ ఆడనున్న 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్కు రోహిత్ అందుబాటులో ఉంటాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ త్వరలో జరగనున్న ఈ సిరీస్ నుంచి భారత్కు పూర్తి స్థాయిలో కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఇక విండీస్తో జరగనున్న రెండు సిరీస్లకు బీసీసీఐ వేర్వేరుగా జట్లను ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా చేతిలో 0-3 తో వైట్ వాష్కు గురైన టీమిండియా మళ్లీ పుంజుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే జట్టులో పలు కీలకమార్పులు చేశారు. కుల్దీప్ యాదవ్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్ ను వన్డే జట్టు నుంచి తప్పించారు. అలాగే యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు జట్టులో చోటు కల్పించారు.
ఈ సిరీస్కు జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. అలాగే కేఎల్ రాహుల్ 2వ వన్డే నుంచి అందుబాటులో ఉంటాడని తెలియజేసింది. ఇక రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్లకు దూరమయ్యాడు. టీ20లకు అక్షర్ పటేల్ అందుబాటులో ఉండనున్నాడు.
వెస్టిండీస్ భారత్ టూర్లో భాగంగా మొత్తం 3 వన్డేలు, 3 టీ20లను ఆడుతుంది. వన్డేలను అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహిస్తారు. కోల్కతాలో టీ20 మ్యాచ్లను నిర్వహించనున్నారు.
వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడనున్న భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అవేష్ ఖాన్
వెస్టిండీస్తో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.
కాగా ఫిబ్రవరి 6న భారత్, విండీస్ల మధ్య మొదటి వన్డే జరుగుతుంది. తరువాత ఫిబ్రవరి 9, 11 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అలాగే ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…