Tammareddy Bharadwaja : బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ పరాజయాల తర్వాత వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలను నిజం చేస్తూ ఆదిపురుష్ చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. కానీ ఈ టీజర్ చూసిన అందరూ షాక్ అయ్యారు.
ఆదిపురుష్ టీజర్ చూస్తుంటే యానిమేషన్ చూస్తున్నట్లు ఉంది అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్పై సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్తో నిండిపోయాయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని, రావణుడు, హనుమంతుడి పాత్రలు ఇలా ఉన్నాయేంటంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందిస్తూ ఇది 3డీ చిత్రమని, థియేటర్లో చూస్తేనే ఈ సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారని దర్శకుడు ఓం రౌత్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్ను థియేటర్స్ లో విడుదల చేసింది. అంతేకాదు 20 రోజుల్లో మరో టీజర్ ను కూడా విడుదల చేస్తామని వెల్లడించింది.
అయితే తాజాగా ఆదిపురుష్ టీజర్, ట్రైలర్పై వస్తున్న ట్రోల్స్ పైన ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదిపురుష్ టీజర్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ ను చూశాను. ప్రభాస్ సినిమా అనేసరికి అందరిలో చాలా వేడిగా వాడిగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. రూ. 500 కోట్లు బడ్జెట్తో బాలీవుడ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అందరిలోనూ ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది.
కానీ ఈ మూవీ టీజర్ నిరాశ పరిచింది. చూడడానికి యానిమేటెడ్ చిత్రంలా ఉంది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ యానిమేటెట్ చిత్రాన్ని పెద్ద సినిమా అని ఎలా అంటారో నాకు అర్థం కావడం లేదు. ఈ సినిమా 3డీలో థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ వేరు విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తుంది. నాకు తెలిసినంత వరకు 3డీలో చేసిన, 4డీలో చేసిన 2డీలో చేసినా యానిమేషన్కి, లైవ్కి చాలా తేడా ఉంటుంది. ఈ సినిమా రజినీకాంత్ తీసిన కొచ్చాడియన్ యానిమేటెడ్ చిత్రంలా తీశారని అందరూ ట్రోల్ చేస్తున్నారు.
చిత్ర యూనిట్ 3డీలో చూసే సరికి మీ అభిప్రాయం మారుతుందంటూ చెప్పుకొస్తున్నారు. కానీ 2డీ నుంచి 3డీకి వెళ్లినంత మాత్రాన వారి గెటప్లు, కాస్ట్యూమ్స్ మారవు కదా అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో పూర్తిగా యానిమేటెడ్ ప్రభాస్ను చూసినట్టుంది. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్ల మీద కూడా చాలా ట్రోలింగ్ వస్తున్నాయి. రాముడిని దేవడిగా కొలిచే మన దేశంలో ఆయన గెటప్ని మార్చేయడం విచిత్రంగా ఉంది. ఆదిపురుష్ టీమ్ 20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు. నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే అని భరద్వాజ తెలియజేశారు. సినిమా మంచిగా రావాలనే నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాని అల్లరి చేయాలని కాదు. ఆదిపురుష్ సినిమాకి ఆల్ ది బెస్ట్ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…