Tammareddy Bharadwaja : బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ పరాజయాల తర్వాత వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలను నిజం చేస్తూ ఆదిపురుష్ చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. కానీ ఈ టీజర్ చూసిన అందరూ షాక్ అయ్యారు.
ఆదిపురుష్ టీజర్ చూస్తుంటే యానిమేషన్ చూస్తున్నట్లు ఉంది అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్పై సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్తో నిండిపోయాయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని, రావణుడు, హనుమంతుడి పాత్రలు ఇలా ఉన్నాయేంటంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందిస్తూ ఇది 3డీ చిత్రమని, థియేటర్లో చూస్తేనే ఈ సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారని దర్శకుడు ఓం రౌత్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్ను థియేటర్స్ లో విడుదల చేసింది. అంతేకాదు 20 రోజుల్లో మరో టీజర్ ను కూడా విడుదల చేస్తామని వెల్లడించింది.
అయితే తాజాగా ఆదిపురుష్ టీజర్, ట్రైలర్పై వస్తున్న ట్రోల్స్ పైన ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదిపురుష్ టీజర్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ ను చూశాను. ప్రభాస్ సినిమా అనేసరికి అందరిలో చాలా వేడిగా వాడిగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. రూ. 500 కోట్లు బడ్జెట్తో బాలీవుడ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అందరిలోనూ ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది.
కానీ ఈ మూవీ టీజర్ నిరాశ పరిచింది. చూడడానికి యానిమేటెడ్ చిత్రంలా ఉంది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ యానిమేటెట్ చిత్రాన్ని పెద్ద సినిమా అని ఎలా అంటారో నాకు అర్థం కావడం లేదు. ఈ సినిమా 3డీలో థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ వేరు విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తుంది. నాకు తెలిసినంత వరకు 3డీలో చేసిన, 4డీలో చేసిన 2డీలో చేసినా యానిమేషన్కి, లైవ్కి చాలా తేడా ఉంటుంది. ఈ సినిమా రజినీకాంత్ తీసిన కొచ్చాడియన్ యానిమేటెడ్ చిత్రంలా తీశారని అందరూ ట్రోల్ చేస్తున్నారు.
చిత్ర యూనిట్ 3డీలో చూసే సరికి మీ అభిప్రాయం మారుతుందంటూ చెప్పుకొస్తున్నారు. కానీ 2డీ నుంచి 3డీకి వెళ్లినంత మాత్రాన వారి గెటప్లు, కాస్ట్యూమ్స్ మారవు కదా అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో పూర్తిగా యానిమేటెడ్ ప్రభాస్ను చూసినట్టుంది. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్ల మీద కూడా చాలా ట్రోలింగ్ వస్తున్నాయి. రాముడిని దేవడిగా కొలిచే మన దేశంలో ఆయన గెటప్ని మార్చేయడం విచిత్రంగా ఉంది. ఆదిపురుష్ టీమ్ 20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు. నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే అని భరద్వాజ తెలియజేశారు. సినిమా మంచిగా రావాలనే నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాని అల్లరి చేయాలని కాదు. ఆదిపురుష్ సినిమాకి ఆల్ ది బెస్ట్ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…