T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 23వ మ్యాచ్లో బంగ్లాదేశ్పై వెస్టిండీస్ గెలుపొందింది. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు కోసం బంగ్లాదేశ్ తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ విజయం విండీస్ను వరించింది. దీంతో బంగ్లాపై విండీస్ కేవలం 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. నికోలాస్ పూరన్ 22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 40 పరుగులు చేయగా.. రోస్టన్ చేజ్ 46 బంతుల్లో 2 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో మహెది హసన్, ముస్తాఫిజుర్ రహమాన్, షొరిఫుల్ ఇస్లామ్లు తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 5 వికెట్లను కోల్పోయి 139 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్మెన్లలో లైటన్ దాస్ 43 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేయగా.. మహ్మదుల్లా 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో రవిరాంపాల్, జేసన్ హోల్డర్, ఆండ్రూ రస్సెల్, అకియల్ హొసెయిన్, డ్వానె బ్రేవోలు తలా 1 వికెట్ తీశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…