T20 World Cup 2021 : షార్జాలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 39వ మ్యాచ్లో ఇంగ్లండ్పై సౌతాఫ్రికా గెలుపొందింది. సౌతాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కొన్ని పరుగుల దూరంలో ఆగిపోయింది. చివరి వరకు కష్టపడినా ఇంగ్లండ్కు గెలుపు దక్కలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్పై సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగుల స్కోరు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లలో రాసీ వన్ డర్ డుస్సెన్ 60 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఎయిడెన్ మార్కరమ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేయగా, క్వింటన్ డికాక్ 27 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో మొయిన్ అలీ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేయగా, డేవిడ్ మలన్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 33 పరుగులు చేశాడు. అలాగే లియామ్ లివింగ్ స్టోన్ 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లు పడగొట్టాడు. తబ్రెయిజ్ శంషీ, డ్వానె ప్రిటోరియస్లకు 2 వికెట్ల చొప్పున దక్కాయి. ఆన్రిచ్ నోర్జె 1 వికెట్ తీశాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…