T20 World Cup 2021 : షార్జాలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 41వ మ్యాచ్లో స్కాట్లండ్పై పాకిస్థాన్ గెలుపొందింది. పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని స్కాట్లండ్ ఛేదించలేకపోయింది. ఈ క్రమంలో స్కాట్లండ్పై పాక్ 72 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజం, షోయబ్ మాలిక్లు అర్థ సెంచరీలతో చెలరేగిపోయారు. 47 బంతుల్లో అజం 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేయగా, మాలిక్ 18 బంతుల్లోనూ 1 ఫోర్, 6 సిక్సర్లతో 54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. స్కాట్లండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ 2 వికెట్లు తీయగా, హంజా తాహిర్, సఫ్యాన్ షరీఫ్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు మాత్రమే చేసింది. స్కాట్లండ్ బ్యాట్స్మెన్లలో రిచీ బెరింగ్టన్ మాత్రమే రాణించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీయగా, షాహీన్ షా అఫ్రిది , హారిస్ రౌఫ్, హసన్ అలీలు తలా 1 వికెట్ తీశారు.
కాగా మొదటి రౌండ్ మ్యాచ్లు ముగియడంతో సెమీస్ వెళ్లే జట్లు ఖరారయ్యాయి. గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్లు సెమీస్కు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన మొదటి సెమీఫైనల్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అబుధాబిలో జరగనుంది. అలాగే రెండో సెమీ ఫైనల్ ఈ నెల 11వ తేదీన పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్లో జరగనుంది. నవంబర్ 14న దుబాయ్ లోనే ఫైనల్ మ్యాచ్ను నిర్వహిస్తారు. ఇక భారత్ సోమవారం నమీబియాతో తలపడనుంది. అందులో విజయం సాధించినా ప్రభావం ఏమీ ఉండదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…