T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 31వ మ్యాచ్ లో పసికూన నమీబియాపై పాకిస్థాన్ విజయం సాధించింది. పాకిస్థాన్ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని చూసినా నమీబియా బెదిరిపోలేదు. పోరాట పటిమను ప్రదర్శించింది. గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. 144 పరుగులు చేయగలిగింది. దీంతో నమీబియాపై పాకిస్థాన్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్మెన్లలో మహమ్మద్ రిజ్వాన్ 79 పరుగులు, బాబర్ అజం 70 పరుగులు చేసి రాణించారు. మరో బ్యాట్స్మన్ మహమ్మద్ హఫీజ్ కూడా 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వెయిస్, జాన్ ఫ్రైలింక్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమీబియా బ్యాట్స్మెన్లలో డేవిడ్ వెయిస్ 43 పరుగులు, క్రెయిగ్ విలియమ్స్ 40, స్టీఫన్ బార్డ్ 29 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఇమాద్ వసీం, హారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్లు తలా 1 వికెట్ తీశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…