T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ అని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఐసీసీ టోర్నీల్లో పాక్పై భారత్ ఎల్లప్పుడూ పైచేయి సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కనుక ఈ మ్యాచ్లోనూ గెలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వారు ఆశలు అడియాశలు అయ్యాయి. భారత్ను పాక్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది.
పాకిస్థాన్ను నిలువరించడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలం అయ్యారు. పాక్ ఓపెనర్లు మొదటి ఓవర్ నుంచే అటాక్ ప్రారంభించారు. దాన్ని చివరి వరకు కొనసాగించారు. దీంతో భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించారు. మొత్తానికి ఈ మ్యాచ్లో భారత్ దారుణంగా ఓటమి పాలు కావడంతో మన ఇజ్జత్ మొత్తం పోయిందనే చెప్పవచ్చు.
ముందు నుంచీ పాక్ ప్లేయర్లు ఎంతో ధీమాగా ఉన్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది భారత జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. తరువాత మిడిలార్డర్ అయినా ఆదుకుంటుందనుకుంటే.. వారు కూడా విఫలం అయ్యాడు. దీంతో కెప్టెన్ కోహ్లి, వికెట్ కీపర్ పంత్లు కొంతసేపు క్రీజులో నిలబడి ఆ మాత్రం స్కోరున అయినా భారత్కు అందించగలిగారు. లేదంటే భారత్ కు ఇంకా దారుణమైన పరాజయం వచ్చి ఉండేది. ఏది ఏమైనా.. ఈ మ్యాచ్ అనంతరం భారత అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…