T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 40వ మ్యాచ్లో ఆఫ్గనిస్థాన్పై న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఫ్గనిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని న్యూజిలాండ్ సునాయాసంగానే ఛేదించింది. కాకపోతే ఆచి తూచి ఆడింది. ఈ క్రమంలో ఆఫ్గనిస్థాన్పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆఫ్గన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో నజీబుల్లా జద్రాన్ ఒక్కడే రాణించాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అతను 73 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ రాణించలేకపోయారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌతీ 2 వికెట్లు తీయగా, ఆడమ్ మిల్నె, జేమ్స్ నీషమ్, ఇష్ సోధిలు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 125 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవాన్ కాన్వేలు రాణించారు. 42 బంతుల్లో 3 ఫోర్లతో విలియమ్సన్ 40 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా.. కాన్వే 32 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆఫ్గన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్, రషీద్ ఖాన్లు చెరొక వికెట్ తీశారు.
కాగా ఈ మ్యాచ్ లో ఆఫ్గనిస్థాన్ గెలిచి ఉంటే భారత్ సెమీస్కు వెళ్లి ఉండేది. కానీ ఇందులో ఆఫ్గనిస్థాన్ ఓటమి పాలైంది. దీంతో భారత్ ఇంటి బాట పట్టక తప్పడం లేదు. ఇంకో మ్యాచ్ నమీబియాతో ఉంది. కానీ అందులో నెగ్గినా పాయింట్ల పట్టికలో 3వ స్థానంలోనే ఉంటుంది. సెమీస్కు వెళ్లదు. కనుక వరల్డ్ కప్లో భారత్ ఇంకో మ్యాచ్తో నిష్క్రమిస్తుందని చెప్పవచ్చు. 2007 వన్డే వరల్డ్ కప్ తరువాత వరల్డ్ కప్లలో తొలి రౌండ్లోనే భారత్ వెనక్కి తిరిగి వస్తుండడం.. ఇది రెండోసారి. కాగా భారత్కు ఇప్పటికే హెడ్ కోచ్గా రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రావిడ్ నియామకం అయ్యాడు. దీంతో త్వరలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ నుంచి ద్రావిడ్ ఆ పదవిలో కొనసాగనున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…