T20 World Cup 2021 : న్యూజిలాండ్ చేతిలో భారత్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో భారత్ సెమీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఐసీసీ టోర్నీల్లో మొదటి రౌండ్లోనే వెను దిరగడం.. 2007 తరువాత ఇదే ప్రథమం. దీంతో అభిమానుల ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. సోషల్ మీడియాలో ఐపీఎల్ ను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున #BanIPL అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు.
మొదటి మ్యాచ్నే ఓటమితో ప్రారంభించిన భారత్కు మొదట్లో అభిమానులు మద్దతుగానే నిలిచారు. కానీ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లోనూ భారత ప్లేయర్ల ఆటతీరు ఏమాత్రం మారలేదు. ఇంకా పాక్తో ఆడిన మ్యాచే నయం అనిపిస్తుంది. అందులో కొంత వరకు పోరాడారు. కానీ న్యూజిలాండ్తో మాత్రం మా వల్ల కాదు, అని పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భారత్ను కివీస్ చితక్కొట్టేసింది. ఈ క్రమంలో భారత్ మొదటి రౌండ్ ఆడి ఇంటికి రాక తప్పడం లేదు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021లో భారత జట్టు అత్యద్భుతంగా ఉందని, కప్ వస్తుందని, గ్యారంటీ అని అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇచ్చింది టీమిండియా. పాక్తో ఓడిన తరువాత న్యూజిలాండ్తోనూ అదే ఆటతీరును ప్రదర్శించింది. అత్యంత బాధ్యతా రాహిత్యంగా ప్లేయర్లు మ్యాచ్లో ఆడారు. చెత్త షాట్లు ఆడి వికెట్లను అనవసరంగా పారేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఐపీఎల్ను బ్యాన్ చేయాల్సిందేనంటూ.. భారత ప్లేయర్లను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…