T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 27వ మ్యాచ్లో నమీబియాపై ఆఫ్గనిస్థాన్ గెలుపొందింది. ఆప్గనిస్థాన్ ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియా తడబడింది. పసికూన జట్టు కావడంతో గెలుపొందలేకపోయింది. ఈ క్రమంలో నమీబియాపై ఆఫ్గనిస్థాన్ 62 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్మెన్లలో మహమ్మద్ షాజాద్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా.. హజ్రతుల్లా జజై 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్మన్ మహమ్మద్ నబీ 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 32 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆస్గర్ ఆఫ్గన్ (31 పరుగులు) కూడా రాణించాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్మన్, జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్లు చెరో 2 వికెట్లు తీశారు. జేజే స్మిట్ 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేసింది. ఈ జట్టు బ్యాట్స్మెన్లలో డేవిడ్ వియసె 30 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. ఆఫ్గన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్ లు చెరో 3 వికెట్లు తీయగా, గుల్బదీన్ నయీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…