Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా జై భీమ్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. సినతల్లిగా నటి లిజోమోల్ యాక్ట్ చేశారు. ఈమె పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్ జై భీమ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
పోలీస్ కస్టడీలో లాకప్ డెత్ లో చనిపోయిన వ్యక్తికి అన్యాయం జరిగిందని ఆయన భార్య చేసిన న్యాయ పోరాటమే ఈ కథ నేపథ్యం. ఈ సినిమా తెలుగు, తమిళం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సెలెబ్రిటీలతోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్.. జై భీమ్ సినిమా డైరెక్టర్ ను ఎంతగానో పొగిడారు. అలాగే సూర్యకు అభినందనలు తెలియజేస్తూ.. లెటర్ కూడా రాశారు.
లేటెస్ట్ సమాచారం ప్రకారం రియల్ సినతల్లి అయిన పార్వతి అమ్మాళ్ కు హీరో సూర్య 10 లక్షల రూపాయల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ డబ్బుపై వచ్చే వడ్డీని ప్రతినెల పార్వతి అమ్మాళ్ కు అందేలా చేశారు. ఈ విషయాన్ని సూర్య తన సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. అలాగే ఇటీవల పార్వతి అమ్మాళ్ కుటుంబానికి అండగా నిలబడి, ఆమెకు ఇల్లు కట్టిస్తానని కోలీవుడ్ హీరో, డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…