Surender Reddy : కిక్, రేసు గుర్రం,సైరా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన దర్శకుడు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్లో నటుడి సరికొత్త కోణాన్ని చూపిస్తానని సురేందర్ రెడ్డి అభిమానులకు హామీ ఇచ్చారు. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. థమన్ స్వరాలు సమకూర్చనున్నారు. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం విదేశాలలో షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. షూటింగ్ కోసం హంగేరి వెళ్లి వచ్చిన ఆయన ఇటీవలే కరోనా బారిన పడ్డారు. సురేందర్ రెడ్డితోపాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు సమచారం. వారంతా క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారని, మిగతా చిత్ర బృందం హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి కోలుకున్న అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా పవన్ పుట్టినరోజు సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న పవన్ 29వ చిత్రానికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ కూడా వదిలారు. యథా కాలమ్.. తథా వ్యవహారమ్.. అంటూ ఓ పోస్టర్ను ప్రకటించారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…