Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రారంభం రోజే ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చారు. ఇక ఆ మొదటి రోజే టీఆర్పీ రేటింగ్ రికార్డ్ సృష్టించింది. ఇక సెప్టెంబర్ 20న సోమవారం ఈ షోకు డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా హాజరై సందడి చేశారు.
ఇక దసరా రోజు సమంత ఈ షోకి హాజరై ఎన్టీఆర్తో కలిసి వినోదం పంచింది. ఈ షోకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంత వరకు అఫీషియల్ ప్రకటన లేకపోగా, తాజాగా నిర్వాహకులు ఓ పోస్టర్ విడుదల చేసి అభిమానులలో ఆనందం నింపారు.
అతి త్వరలోనే ఈ షో ప్రసారం కానుందని తెలియజేస్తూ ఎన్టీఆర్, మహేష్ ఫొటో విడుదల చేశారు. టీఆర్పీ రేటింగ్ పెంచడానికి నిర్వాహకులు.. ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేములోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
తారక్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతోంది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి షో ఆధారంగా వచ్చింది ఎవరు మీలో కోటీశ్వరులు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ కింగ్ నాగార్జున బుల్లితెరపై సందడి చేయగా.. తాజాగా తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు.. అంటూ అలరిస్తున్నారు. ఇక మహేష్, ఎన్టీఆర్ల ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…