Suchendra Prasad : నటి పవిత్ర లోకేష్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఆమె తన ఫేక్ అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. మరోవైపు ఓ కన్నడ న్యూస్ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఆమె సంచలన విషయాలను వెల్లడించింది. తనకు, నరేష్కు ఉన్న సంబంధం నిజమేనని అంగీకరించింది. సూపర్ స్టార్ కృష్ణకు ఈ విషయం తెలుసని.. నరేష్ కుటుంబ సభ్యులు తమకు అడ్డు చెప్పలేదని.. ఇంక ఎవరు ఏం అనుకున్నా తనకు అభ్యంతరం లేదని తెలియజేసింది. అలాగే తనకు, సుచేంద్ర ప్రసాద్కు పెళ్లి కాలేదని.. సహజీవనం మాత్రమే చేశామని ఆమె తెలిపింది. అయితే అనూహ్యంగా సుచేంద్ర ప్రసాద్ ఈ మ్యాటర్లోకి రంగ ప్రవేశం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
పవిత్ర లోకేష్ వ్యవహారంపై సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పవిత్రా లోకేష్తో జీవితం మొదట్లో బాగానే ఉండేదని అన్నారు. అయితే తమకు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆమె తనను ఒంటరిని చేసి వెళ్లిపోయిందని అన్నారు. ఆమెకు ఎల్లప్పుడూ డబ్బు, విలాసాలు కావాలని, లగ్జరీ లైఫ్ను కోరుకుంటుందని తెలిపారు. తాను అప్పట్లో ఆర్థికంగా ఆ స్థాయిలో లేనని, కనుక తనను వదిలేసిందన్నారు. తనతో కాపురం చేస్తున్నప్పుడు కూడా ఇతర వ్యక్తులతో ఆమె రిలేషన్ షిప్ను మెయింటెయిన్ చేసిందన్నారు. అయితే తాను ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదన్నారు.
తాను ఆమెను కొట్టినట్లు, తిట్టినట్లు చెప్పిందని.. అయితే అవన్నీ నిజాలు కావని అన్నారు. నేను కొడుతున్నానని చెప్పి నరేష్తో ఉండడం ఎంత వరకు కరెక్ట్ ? అని ప్రశ్నించారు. అసలు ఆయన కాపురాన్ని ఆమె ఎందుకు కూల్చాలి ? ఇది ఆమెకు అలవాటే.. వీలుని బట్టి ఎంత దొరికితే ఆమె అంత దోచుకుంటుంది.. ఆమెకు జీవితంపై ఆశలు ఎక్కువ.. కష్టపడే మనస్తత్వం కాదు. అయితే నరేష్ను ఆమె పెళ్లి చేసుకున్నా 6 నెలల్లోనే ఆమె ఆయనను వదిలేస్తుంది. తనకు కావల్సిన డబ్బు చేతికి అందాక ఆయనను ఆమె విడిచిపెడుతుంది.. ఇది పక్కా జరిగి తీరుతుంది.. అని సుచేంద్ర ప్రసాద్ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే సుచేంద్ర ప్రసాద్ కామెంట్స్పై పవిత్రా లోకేష్ ఏమంటుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…