Suchendra Prasad : నటి పవిత్ర లోకేష్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఆమె తన ఫేక్ అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. మరోవైపు ఓ కన్నడ న్యూస్ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఆమె సంచలన విషయాలను వెల్లడించింది. తనకు, నరేష్కు ఉన్న సంబంధం నిజమేనని అంగీకరించింది. సూపర్ స్టార్ కృష్ణకు ఈ విషయం తెలుసని.. నరేష్ కుటుంబ సభ్యులు తమకు అడ్డు చెప్పలేదని.. ఇంక ఎవరు ఏం అనుకున్నా తనకు అభ్యంతరం లేదని తెలియజేసింది. అలాగే తనకు, సుచేంద్ర ప్రసాద్కు పెళ్లి కాలేదని.. సహజీవనం మాత్రమే చేశామని ఆమె తెలిపింది. అయితే అనూహ్యంగా సుచేంద్ర ప్రసాద్ ఈ మ్యాటర్లోకి రంగ ప్రవేశం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
పవిత్ర లోకేష్ వ్యవహారంపై సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పవిత్రా లోకేష్తో జీవితం మొదట్లో బాగానే ఉండేదని అన్నారు. అయితే తమకు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆమె తనను ఒంటరిని చేసి వెళ్లిపోయిందని అన్నారు. ఆమెకు ఎల్లప్పుడూ డబ్బు, విలాసాలు కావాలని, లగ్జరీ లైఫ్ను కోరుకుంటుందని తెలిపారు. తాను అప్పట్లో ఆర్థికంగా ఆ స్థాయిలో లేనని, కనుక తనను వదిలేసిందన్నారు. తనతో కాపురం చేస్తున్నప్పుడు కూడా ఇతర వ్యక్తులతో ఆమె రిలేషన్ షిప్ను మెయింటెయిన్ చేసిందన్నారు. అయితే తాను ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదన్నారు.
తాను ఆమెను కొట్టినట్లు, తిట్టినట్లు చెప్పిందని.. అయితే అవన్నీ నిజాలు కావని అన్నారు. నేను కొడుతున్నానని చెప్పి నరేష్తో ఉండడం ఎంత వరకు కరెక్ట్ ? అని ప్రశ్నించారు. అసలు ఆయన కాపురాన్ని ఆమె ఎందుకు కూల్చాలి ? ఇది ఆమెకు అలవాటే.. వీలుని బట్టి ఎంత దొరికితే ఆమె అంత దోచుకుంటుంది.. ఆమెకు జీవితంపై ఆశలు ఎక్కువ.. కష్టపడే మనస్తత్వం కాదు. అయితే నరేష్ను ఆమె పెళ్లి చేసుకున్నా 6 నెలల్లోనే ఆమె ఆయనను వదిలేస్తుంది. తనకు కావల్సిన డబ్బు చేతికి అందాక ఆయనను ఆమె విడిచిపెడుతుంది.. ఇది పక్కా జరిగి తీరుతుంది.. అని సుచేంద్ర ప్రసాద్ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే సుచేంద్ర ప్రసాద్ కామెంట్స్పై పవిత్రా లోకేష్ ఏమంటుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…