SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను చిక్బలాపూర్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు రావడమే కాకుండా కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులకు అలాగే శివ రాజ్ కుమార్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు సహాయం చేసినందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.
గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు దారుణంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. సినీ ప్రముఖుల కోరిక మేరకు సినీ పరిశ్రమ సమస్యలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ సినిమా టికెట్ల ధరలను పెంచుతూ జీవో విడుదల చేశారు. ఈ జీవో విడుదల అయిన తర్వాత రాజమౌళి మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎ జగన్ తమ సినిమా గురించి చెప్పగానే ఆయన అర్థం చేసుకొని సినిమా టికెట్ల రేట్లను పెంచారని జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఉండగా చిత్ర పరిశ్రమ కోసం పోరాడటానికి ఒకే ఒక వ్యక్తి ముందుకు వచ్చారని, ఆయనే మెగాస్టార్ చిరంజీవి.. అంటూ చిరంజీవిని ప్రశంసించారు. ఆయనని ఎందరో ఎన్నో మాటలు అన్నప్పటికీ మా గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆయనే నిజమైన మెగాస్టార్. ఆయనను నేను ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నాను.. అంటూ రాజమౌళి కామెంట్స్ చేశారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా.. చిరంజీవే ఇండస్ట్రీకి పెద్ద.. అని రాజమౌళి అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…