SS Rajamouli : దర్శకుడు రాజమౌళి అంటే చాలా మందికి గౌరవం ఉండేది. కానీ ఆయన తాజాగా చేసిన ట్వీట్లు ఆయన గౌరవాన్ని పోగొట్టేలా ఉన్నాయి. ఆయన ఒక ఉద్దేశంతో ట్వీట్లు చేశారు. కానీ ఆయనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
దర్శకుడు రాజమౌళి తన బాహుబలి టీమ్లో పనిచేసిన దేవిక అనే మహిళ గురించి ట్వీట్ చేశారు. ఆమె తన ప్రొడక్షన్ వర్క్స్లో బాహుబలి సినిమాలకు పనిచేసిందని, అయితే దురదృష్టవశాత్తూ ఆమెకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని.. కనుక మనస్సున్న వారు, దాతలు సహాయం చేయాలని కోరుతూ రాజమౌళి లింక్ను షేర్ చేశారు. అయితే ఆయన చేసిన ట్వీట్ రివర్స్లో ఆయనకే తగిలింది.
రాజమౌళి చేసిన ట్వీట్ల పట్ల నెటిజన్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్క సినిమాకు రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటారు కదా. పైగా ఆమె మీ ప్రొడక్షన్ టీమ్లో సభ్యురాలు అన్నారు. కనుక మీరే ఆమెకు సహాయం చేయవచ్చు కదా. రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే మీకు రూ.3 కోట్లు లెక్క కావు కదా.. అందుకు మమ్మల్ని సహాయం చేయమని క్యాంపెయిన్ రన్ చేయడం ఎందుకు ? ఆ డబ్బేదో మీరే ఇవ్వవచ్చు కదా.. అని చాలా మంది రాజమౌళిని విమర్శిస్తున్నారు.
ఇక కొందరు అయితే.. రాజమౌళి చాలా స్వార్థపరుడని.. తన దగ్గర పనిచేసే వ్యక్తికి సహాయం అందించాల్సింది పోయి.. ఇలా అందరినీ డబ్బులు అర్థించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కింద రూ.4 కోట్లు ఇచ్చారు. ఆయనకు చెబితే సరిపోతుంది కదా.. సహాయం చేస్తారు.. అని కొందరు కామెంట్లు చేశారు.
కాగా.. మీకు ఎంతో మంది దర్శకులు, హీరోలు, చాలా మంది నిర్మాతలు తెలుసు. అందరికీ ఒక మాట చెబితే.. అందరూ ఎంతో కొంత విరాళం ఇస్తారు కదా.. దాంతో దేవికకు సహాయం చేయవచ్చు. అదిపోయి అందరినీ విరాళాలు అడగడం ఏమిటి ? మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు.. అని ఇంకొందరు కామెంట్లు చేశారు.
రాజమౌళి చేసిన ట్వీట్లు ఇలా ఆయనకే రివర్స్లో తగులుతాయని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆయన చేసిన పనికి ఆయనను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…