Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటోంది. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ఈమె స్పందిస్తూనే.. తన సొంత యూట్యూబ్ చానల్లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది. వాటికి ఆదరణ బాగానే లభిస్తోంది. అయితే శ్రీరెడ్డి యాక్టివ్ రాజకీయాల్లో లేదు. కానీ వైసీపీకి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంటుంది. జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతుంటుంది. అయితే తాజాగా ఆమె వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రీరెడ్డి తాజాగా ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తే.. డబ్బు ఇస్తారని అనుకుంటారని.. కానీ అందులో నిజం లేదని శ్రీరెడ్డి తెలిపింది. తనకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను పార్టీ మరిచిపోకూడదని పేర్కొంది. తమ గ్రామంలో తాను, తన తండ్రి కలసి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించామని.. దీనికి టీడీపీ హయాంలో నిధులు వచ్చాయని తెలియజేసింది.
అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేసింది. తాను ఇదే విషయంపై ఎంతో మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిశానని.. అయినప్పటికీ ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపింది. ఈ క్రమంలో తమ దేవుడు గుడి బయటనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నిధుల కోసం తాము ఎంతో ప్రయత్నించామని, అయినప్పటికీ వీలు కాలేదని పేర్కొంది. అయితే ఉన్నట్లుండి శ్రీరెడ్డి సడెన్గా వైసీపీ ప్రభుత్వంపై ఇలా విమర్శలు ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని కొందరు అంటున్నారు. మరి ఇలాగైనా ఆమె తన సమస్యను పరిష్కరించుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…