Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటోంది. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ఈమె స్పందిస్తూనే.. తన సొంత యూట్యూబ్ చానల్లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది. వాటికి ఆదరణ బాగానే లభిస్తోంది. అయితే శ్రీరెడ్డి యాక్టివ్ రాజకీయాల్లో లేదు. కానీ వైసీపీకి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంటుంది. జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతుంటుంది. అయితే తాజాగా ఆమె వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రీరెడ్డి తాజాగా ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తే.. డబ్బు ఇస్తారని అనుకుంటారని.. కానీ అందులో నిజం లేదని శ్రీరెడ్డి తెలిపింది. తనకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను పార్టీ మరిచిపోకూడదని పేర్కొంది. తమ గ్రామంలో తాను, తన తండ్రి కలసి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించామని.. దీనికి టీడీపీ హయాంలో నిధులు వచ్చాయని తెలియజేసింది.
అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేసింది. తాను ఇదే విషయంపై ఎంతో మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిశానని.. అయినప్పటికీ ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపింది. ఈ క్రమంలో తమ దేవుడు గుడి బయటనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నిధుల కోసం తాము ఎంతో ప్రయత్నించామని, అయినప్పటికీ వీలు కాలేదని పేర్కొంది. అయితే ఉన్నట్లుండి శ్రీరెడ్డి సడెన్గా వైసీపీ ప్రభుత్వంపై ఇలా విమర్శలు ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని కొందరు అంటున్నారు. మరి ఇలాగైనా ఆమె తన సమస్యను పరిష్కరించుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…