Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటోంది. తన యూట్యూబ్ చానల్లో పలు వంటకాలకు చెందిన వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల వంటకాలను శ్రీరెడ్డి చేసి చూపించింది. చికెన్, మటన్, రొయ్యలు, చేపలు.. ఇలా అనేక వంటలను వండింది. దీంతోపాటు రెస్టారెంట్లలోనూ సందడి చేసింది. పలు రెస్టారెంట్లకు వెళ్లి ఫుడ్ను తిని వాటికి రివ్యూలు ఇచ్చింది. అయితే తాజాగా శ్రీరెడ్డికి చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె అర్థరాత్రి పూట బైక్లను ఆపుతూ హల్ చల్ చేసింది. అయితే ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రీరెడ్డికి తెలుగులో అవకాశాలు లేవు కానీ చెన్నైకి మకాం మార్చాక అక్కడ బాగానే అవకాశాలు వస్తున్నాయి. అక్కడి టీవీ చానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అవుతోంది. అలాగే అక్కడి యూట్యూబ్ చానల్స్తోనూ సందడి చేస్తోంది. అందులో భాగంగానే ఈమె ఓ యూట్యూబ్ చానల్తో కలిసి అర్థరాత్రి చెన్నై రోడ్లపై ప్రాంక్ వీడియోలు చేసింది. ఆ చానల్ వారు ఆమెకు చాలెంజ్ విసిరారు. మీరు ఎప్పుడైనా ఎవరి ఫోన్ నంబర్ అయినా అడిగి తీసుకున్నారా.. అని వారు అడగ్గా.. లేదు.. అని శ్రీరెడ్డి సమాధానం ఇచ్చింది. అయితే ఇప్పుడు రోడ్డుపై బైక్ను ఆపి ఫోన్ నంబర్లను అడిగి తీసుకోండి.. ఎంతమంది ఇస్తారో చూద్దాం.. అని అడగ్గా.. అందుకు ఆమె సరే అని చెప్పి వెంటనే రంగంలోకి దిగింది.
అలా శ్రీరెడ్డి అర్థరాత్రి చెన్నై రోడ్లపై హల్చల్ చేసింది. బైక్స్ను ఆపి వారిని కవ్విస్తూ.. వారికి మసాలా మాటలు చెబుతూ ఫోన్ నంబర్లను అడిగి తీసుకుంది. ఈ క్రమంలోనే ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. శ్రీరెడ్డి ఇలా చేసిందేమిటి.. అని నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…