Sri Reddy : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తనకు నచ్చిన వంటలను చేస్తూ ఆ వీడియోలను ఆమె యూట్యూబ్లో అప్లోడ్ చేస్తోంది. అలాగే నచ్చిన ప్రదేశాలకు టూర్లకు కూడా వెళ్తోంది. ఇటీవలే ఆమె గోవాలో సందడి చేసింది. అక్కడ ఎన్టీఆర్కు ఇష్టమైన ప్రదేశాలు ఇవే.. అంటూ ఆమె టూర్లో తిరిగి ఆయా ప్రదేశాలను చూపించింది. ఇక తాజాగా మరోసారి ఇంకో వంట వీడియోతో మన ముందుకు వచ్చింది. ఈసారి ఆమె కుండ బిర్యానీ వండి అలరించింది.
సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా కుండ బిర్యానీ వండింది. అది భీమవరం కుండ బిర్యానీ. చూస్తుంటేనే నోరూరిపోతోంది. ఆ బిర్యానీని వండిన శ్రీరెడ్డి దాని వీడియోను పోస్ట్ చేయగా.. అది యూట్యూబ్లో వైరల్ అవుతోంది. చాలా మంది ఆ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. శ్రీరెడ్డి కుండ బిర్యానీ అద్భుతంగా ఉందని.. దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. తమకు కూడా ఆ బిర్యానీ కావాలని ఆమెను అడుగుతున్నారు.
ఇక శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అనేక సామాజిక, రాజకీయ అంశాలపై కూడా ఆమె స్పందిస్తోంది. దీంతో ఆమె కామెంట్స్ హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. ఇక శ్రీరెడ్డి ఈ మధ్య మెగా డాటర్ నిహారికపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె డ్రగ్స్ కేసులో చిక్కుకుపోవడంతో కుమార్తెను ఇలాగేనా పెంచేది నాగబాబు అంటూ తీవ్ర స్థాయిలో ఆయనపై ఆమె విమర్శలు చేసింది. కానీ నాగబాబు కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. తనను విమర్శించే వాళ్లకు ఆయన ఒక్క వాక్యంతో సమాధానం చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ కూడా ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే నిహారిక మళ్లీ ఇప్పుడు బయటికి వచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుండడం విశేషం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…