Sri Reddy : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రించే వరకు అందరూ అందులోనే విహరిస్తున్నారు. కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సోషల్ మీడియాను ఆదాయ వనరుగా కూడా చేసుకుంటున్నారు. ఇక నటీనటులు కూడా తమ వీడియోలను అందులో పెడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో శ్రీరెడ్డి ముందు ఉంటుందని చెప్పవచ్చు. ఈమె టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయింది. తరువాత కనిపించకుండా పోయింది. కానీ యూట్యూబ్ ద్వారా మళ్లీ నెటిజన్లను అలరిస్తోంది.
శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. రకరకాల వంటలను వండుతూ అందాల విందు చేస్తూ అలరిస్తోంది. ఇప్పటికే అనేక రకాల వంటలను వండిన శ్రీరెడ్డి తాజాగా కొరమీను చేపలను వండింది. తనదైన శైలిలో పంచ్లు విసురుతూ కబుర్లు చెబుతూ చేపలను వండింది. దీంతో ఆమె వండిన కూరను చూస్తుంటే నోట్లో నీళ్లూరుతున్నాయంటే నమ్మండి. ఇక శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. కానీ దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్పై మాత్రం విమర్శలను ఎక్కు పెడుతోంది.
అభిరామ్ త్వరలోనే తేజ దర్శకత్వంలో వస్తున్న అహింస అనే మూవీతో మన ముందుకు రానున్నాడు. దీంతో ఆయనపై శ్రీరెడ్డి ప్రస్తుతం సంచలన కామెంట్స్ చేస్తోంది. ఇక ఇటీవలే పవన్ మీద కూడా దారుణంగా విమర్శలు చేస్తూ బూతులు తిట్టేసింది. పవన్ ఓ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. దీంతో పవన్ను శ్రీరెడ్డి కూడా అంతే రేంజ్లో తిట్టింది. దీంతో ఆమె వీడియో వైరల్ అయింది. కాగా ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటూ యూట్యూబ్లో వంటల ద్వారా అలరిస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…