రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వరుస ఫ్లాప్ లు వచ్చినప్పటికీ డార్లింగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 43వ పుట్టిన రోజు వేడుకలను ఈ రోజు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే రెబల్ రీ-రిలీజ్ అవ్వగా.. ఈరోజు బిల్లా 4కే వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
దీంతో థియేటర్లలో అభిమానుల సందడి మామూలుగా లేదు. సినిమా హాళ్ల వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి డార్లింగ్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. అలాగే బిల్లా రీ-రిలీజ్ సందర్భంగా అభిమానులు తీవ్ర అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఓ థియేటర్ మొత్తం కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్ లో ఈ ఘటన జరిగింది. తాజా సమాచారం ప్రకారం..
చాలాకాలంగా మూతబడిన వెంకట్రామ థియేటర్ ను బిల్లా స్పెషల్ షో కోసం రీఓపెన్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షో స్టార్ట్ కాగానే థియేటర్ లో బాణాసంచా పేల్చారు. దీంతో ఒక్కసారిగా థియేటర్ లోని సీట్లకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. ఆడియెన్స్ ఒక్కసారిగా భయంతో బయటికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటల్ని ఆర్పి షోను నిలిపివేశారు. అభిమానం హద్దులు మీరితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మరోసారి రుజువైంది. ఇదిలా ఉండగా పలువురు డార్లింగ్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…