Sreesanth : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మధ్య కాలంలో బ్యాట్తోనూ విఫలమవుతున్నాడు. దీంతో గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి కోహ్లికి వచ్చిందని చెప్పవచ్చు. గతేడాది టీ20 వరల్డ్ కప్లో భారత్ నిష్క్రమణ అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. తరువాత వన్డే, టెస్టుల్లోనూ అతన్ని జట్టు కెప్టెన్గా తొలగించారు. తరువాత రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. అయితే కోహ్లిపై తాజాగా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. కోహ్లి కెప్టెన్సీలో తాను ఆడి ఉంటే భారత్కు 2015, 2019లలో వన్డే, 2021లో టీ20 మొత్తం 3 వరల్డ్ కప్లను తెప్పించి ఉండే వాడినని అన్నాడు. దీంతో శ్రీశాంత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొందరు అతని వ్యాఖ్యలపై ట్రోల్ చేస్తున్నారు. ఇక శ్రీశాంత్ ఈమధ్యే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలో జీవితకాలం నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాటం చేశాడు. దీంతో ఆ పిటిషన్లో అతను గెలిచాడు. తరువాత జట్టులో చోటు కోసం ఆశించాడు. కానీ బీసీసీఐ అతనికి మొండి చేయి చూపించింది.
ఇక ఈ మధ్యే నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో కూడా శ్రీశాంత్ పాల్గొన్నాడు. కానీ అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో శ్రీశాంత్ అంతర్జాతీ క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పినట్లు తెలిపాడు. శ్రీశాంత్ మొత్తంగా తన కెరీర్లో భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడగా.. 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచిన జట్టుతోపాటు 2007లో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ అతను సభ్యుడిగా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్లో చివరి బంతికి శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్ పట్టి పాక్పై భారత్కు విజయాన్ని అందించాడు. అందుకనే పైవిధంగా అతను కామెంట్స్ చేసి ఉంటాడని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…