Sreemukhi : బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు టీవీ షోలలోనే కాకుండా.. సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తోంది. టీవీ షోలలో ఈమె చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఒక రేంజ్లో రచ్చ చేస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ శ్రీముఖి ఎంతో యాక్టివ్గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. ఇవి వైరల్ అవుతుంటాయి. అందులో భాగంగానే తాజాగా శ్రీముఖి ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను షేర్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పంజాబీ పాటకు ఆమె భాంగ్రా స్టైల్ డ్యాన్స్ చేసి అలరించింది.
అలా డ్యాన్స్ చేస్తున్న శ్రీముఖి ఒక్కసారిగా అలసిపోయినట్లు అయింది. దీంతో వెంటనే ఇంక తన వల్ల కాదు అన్నట్లుగా పక్కనే ఉన్న బెడ్ మీద పడిపోయింది. కాగా శ్రీముఖికి చెందిన ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. సహజంగానే శ్రీముఖి యాంకర్ గా గలగలా మాట్లాడడమే కాదు.. డ్యాన్స్లు కూడా చేయగలదు. ఈమె ఎక్కడ ఉన్నా సరే సందడిగా ఉంటుంది. శ్రీముఖి టీవీ షోలలో ఎంతో సందడి చేస్తుంటుంది. తోటి కంటెస్టెంట్లను ఆట పట్టిస్తుంటుంది. ఇక శ్రీముఖికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువగానే ఉన్నారు.
తోటి యాంకర్లు అందాల ప్రదర్శన చేస్తున్నా శ్రీముఖి మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉంటుందని చెప్పవచ్చు. అవసరం అయినంత మేరకే గ్లామర్ షో చేస్తుంటుది. అయినప్పటికీ ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసే ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె చేసిన డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసిందని కామెంట్లు పెడుతున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…