Liger Movie : గతకొన్ని రోజులుగా ఎక్కడ చూసినా లైగర్ పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ చేసిన పాన్ ఇండియా చిత్రమే లైగర్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరీ జగన్నాథ్ విజయం అందుకోవడం, రౌడీ బాయ్ విజయ్ కి నార్త్ లో కూడా ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టు ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్నింటికీ మంచి స్పందన వచ్చింది. లైగర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకులలో కూడా ఈ చిత్రానికి అంచనాలు భారీగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా నటించగా, బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో విజయ్ కి తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా నటించింది. గత కొన్ని రోజులుగా ఉత్తరాదిలో కొన్ని చిత్రాలను బాయ్ కాట్ చేయాలని విమర్శలు వెలువడుతున్నాయి. ఇదే సెగ లైగర్ కు కూడా తగిలింది. లైగర్ చిత్రంపై నెగిటివ్ కామెంట్స్ వెలువడుతున్నాయి. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యండి అంటూ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ చిత్రంపై నెగెటివిటీ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. చిత్రయూనిట్ సైతం నెగిటివ్ టాక్ ని పాజిటివ్ గా మార్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ ఇబ్బందులన్నీ దాటుకుని లైగర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
బింబిసార ఘన విజయాన్ని అందుకోవడంతో అందరు హీరోల అభిమానులు బింబిసార చిత్రాన్ని పొగడ్తల వర్షంతో ముంచెత్తారు. కానీ విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే చిత్రం విడుదల కాకుండానే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడాన్ని చాలామంది హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దానితో లైగర్ చిత్రంపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఈ గురువారం లైగర్ చిత్రం విడుదల కావడంతో ఎలాంటి విమర్శలు సోషల్ మీడియా ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…